News December 12, 2024
వైసీపీలో ఎవరికీ గౌరవం లేదు: అవంతి శ్రీనివాస్

AP: వైసీపీలో నేతలు, కార్యకర్తలకు గౌరవం లేదని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. YCPకి రాజీనామా చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైసీపీలో ఏకపక్ష నిర్ణయాలే ఉంటాయి. అందరి అభిప్రాయాలు, సలహాలు తీసుకోరు. కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా కాకముందే ధర్నాలు చేయడమేంటి? ప్రతి విషయాన్ని ఆ పార్టీ రాజకీయం చేస్తోంది. జమిలి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ ధర్నాలు, నిరసనలు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News November 27, 2025
అమరావతిలో వేంకటేశ్వర ఆలయ విస్తరణ.. నేడు సీఎం భూమిపూజ

AP: అమరావతి కృష్ణానది తీరంలో శ్రీవేంకటేశ్వర ఆలయ విస్తరణ, అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకోసం 2 దశల్లో ₹260Cr వెచ్చించనుంది. ఈ పనులకు CM CBN ఇవాళ భూమి పూజ చేయనున్నారు. దాదాపు 3వేల మంది భక్తులు పాల్గొని వీక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాకారం, ఏడంతస్తుల రాజగోపురం, సేవా మండపం, రథ మండపం, పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం, పుష్కరిణి, విశ్రాంతి భవనం తదితర పనులు పూర్తిచేస్తారు.
News November 27, 2025
వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి రక్షణ ఇలా..

వేరుశనగ, మొక్కజొన్న పంటలకు పందుల నుంచి ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీనికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వేరుశనగ పొలం చుట్టూ 4 వరుసల్లో కుసుమ పంట వేస్తే ఆ మొక్క ముళ్లు పందిని గాయపర్చే అవకాశం ఉంది. కుసుమ మొక్క వాసన ఘాటుగా ఉండడం వల్ల వేరుశనగ పంట వైపు పందులు రావు. మొక్కజొన్న పంట చుట్టూ ఆముదం పంటను వేసి రక్షించుకోవచ్చు. అలాగే ముళ్లు గల ఎడారి మొక్కలు, వాక్కాయ మొక్కలను పెంచి పంటలను కాపాడుకోవచ్చు.
News November 27, 2025
RVNLలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ (<


