News December 12, 2024
వైసీపీలో ఎవరికీ గౌరవం లేదు: అవంతి శ్రీనివాస్
AP: వైసీపీలో నేతలు, కార్యకర్తలకు గౌరవం లేదని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోపించారు. YCPకి రాజీనామా చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘వైసీపీలో ఏకపక్ష నిర్ణయాలే ఉంటాయి. అందరి అభిప్రాయాలు, సలహాలు తీసుకోరు. కొత్త ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా కాకముందే ధర్నాలు చేయడమేంటి? ప్రతి విషయాన్ని ఆ పార్టీ రాజకీయం చేస్తోంది. జమిలి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఈ ధర్నాలు, నిరసనలు’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News January 21, 2025
32,438 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 32,438 లెవల్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ లేదా ఐటీఐ పాసైన వారు అర్హులు. వయసు 18-36 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లికేషన్ ఫీజు రూ.500. CBT, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంపిక చేస్తారు. మహిళలు, పురుషులు అప్లై చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ <
News January 21, 2025
గ్రూప్-1 మెయిన్స్: ఈ నగరాల్లోనే సెంటర్లు
AP: గ్రూప్-1 మెయిన్స్కు ఏపీపీఎస్సీ 1:50 చొప్పున అభ్యర్థులను ఎంపిక చేసింది. దీని ప్రకారం 4,496 మంది <<15215857>>మెయిన్స్ రాసేందుకు<<>> అర్హత సాధించారు. 2023 DECలో 89 గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్ జరిగింది. మెయిన్స్ కోసం విశాఖ, విజయవాడ, తిరుపతి, అనంతపురంలో సెంటర్లు ఏర్పాటు చేశారు.
News January 21, 2025
ఎంత పని చేశావ్ ట్రంప్ మావా!
USAలో అక్రమంగా ఉంటున్న వారిపైనే ట్రంప్ చర్యలు తీసుకుంటారని అంతా భావించారు. కానీ వచ్చీ రాగానే లీగల్ ఇమ్మిగ్రెంట్స్కూ షాక్ ఇచ్చారు. USAలో పుట్టే పిల్లల పేరంట్స్లో ఒకరికి గ్రీన్ కార్డు/US పౌరసత్వం ఉంటేనే జన్మత: పౌరసత్వం కల్పించేలా నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎవరైనా USAలో పుట్టగానే అక్కడి పౌరులయ్యేవారు. వారి పేరంట్స్ విదేశీయులైతే, కాస్త ఆలస్యమైనా ఆ కపుల్కు గ్రీన్ కార్డు వచ్చేది. ఇప్పుడిది కష్టమే.