News December 2, 2024

మావోలపై విష పదార్థాలు వాడలేదు: డీజీపీ

image

TG: ములుగు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలకు కోర్టు ఆదేశాల మేరకే పోస్టుమార్టం నిర్వహిస్తామని DGP జితేందర్ తెలిపారు. తాము ఎవరిపైనా విష పదార్థాలు వినియోగించలేదని తెలిపారు. పౌర హక్కుల నేతల ఆరోపణలు అవాస్తవమని అన్నారు. మావోయిస్టుల చర్యలను అడ్డుకునేందుకు కూంబింగ్‌ ఆపరేషన్‌ చేశామని, వారు అత్యాధునిక ఆయుధాలతో కాల్పులు జరపడంతో ప్రాణరక్షణ కోసం ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు.

Similar News

News January 18, 2025

కొత్త రేషన్ కార్డులపై UPDATE

image

TG: రాష్ట్రవ్యాప్తంగా 6.68 లక్షల కుటుంబాలు కొత్త రేషన్ కార్డులు పొందేందుకు అర్హమైనవిగా ప్రాథమికంగా గుర్తించారు. ఇందులో 11.65 లక్షల మంది పేర్లు ఉన్నాయి. ఈ నెల 20-24 వరకు గ్రామాలు, వార్డుల్లో సభలు పెట్టి అభ్యంతరాలు సేకరించిన తర్వాత తుది జాబితా ఖరారు చేస్తారు. ఇలా కలెక్టర్ల ద్వారా వచ్చే లిస్టులతో జనవరి 26 నుంచి కార్డులు మంజూరు చేస్తారు. రేషన్ కార్డులపై సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సంతకాలు ఉండనున్నాయి.

News January 18, 2025

రంజీ మ్యాచులకు కోహ్లీ, రాహుల్ దూరం!

image

ఈనెల 23 నుంచి జరిగే రంజీ ట్రోఫీ మ్యాచులకు కోహ్లీ, KL రాహుల్ దూరం కానున్నట్లు ESPN CRIC INFO తెలిపింది. మెడ గాయంతో కోహ్లీ, మోచేతి గాయంతో రాహుల్ బాధపడుతున్నారని పేర్కొంది. ఈనెల 30 నుంచి జరగనున్న మ్యాచులకు వీరిద్దరూ అందుబాటులో ఉండే అవకాశమున్నా, ఆ వెంటనే ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఉండటంతో వారు రంజీల్లో ఆడే అవకాశం లేదని తెలిపింది.

News January 18, 2025

అన్నకు సవాల్ విసిరిన మంచు మనోజ్

image

మంచు బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం మరింత పెరుగుతోంది. నిన్న కుక్క-సింహం అంటూ ట్వీట్స్ చేసుకున్న ఈ అన్నదమ్ములు.. సై అంటే సై అంటూ ఈరోజు మనోజ్ సవాల్ విసిరారు. ‘దా.. కూర్చుని మాట్లాడుదాం. మహిళలు, నాన్న, స్టాఫ్‌ను పక్కన పెట్టి మనం కలుసుకుందాం. ఒట్టేసి చెబుతున్నా.. నేనొక్కడినే వస్తా. నువ్వు ఎవరినైనా, ఎంతమందినైనా తీసుకొచ్చుకో. లేకపోతే మనం హెల్తీ ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం’ అని ట్వీట్ చేశారు.