News May 20, 2024

మత ప్రాతిపదికన మైనార్టీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదు: జైరాం రమేశ్

image

మతం ఆధారంగా రిజర్వేషన్లు, పౌరసత్వం ఇవ్వకూడదన్న రాజ్యాంగానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో మైనార్టీలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించలేదన్నారు. సామాజిక, ఆర్థిక వెనకబాటుతనం ఆధారంగానే ఇచ్చామని పేర్కొన్నారు. బీజేపీ మత ప్రాతిపదికన పౌరసత్వం ఇస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టారు.

Similar News

News December 2, 2025

EPS-95 పెన్షన్ పెంపుపై కేంద్రం క్లారిటీ

image

EPFO కింద కవరయ్యే EPS-95 పెన్షన్‌‌ను రూ.1000 నుంచి రూ.7,500కు పెంచాలన్న డిమాండ్‌ను కేంద్రం తోసిపుచ్చింది. ఆ ప్రతిపాదన లేదని తేల్చి చెప్పింది. 2019 మార్చి 31నాటికి ఫండ్ విలువలో యాక్చురియల్ లోటుందని తెలిపింది. అంటే పెన్షన్ చెల్లించేందుకు సరైన రాబడి లేదు. MP సురేశ్ గోపీనాథ్ మాత్రే లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి శోభా కరంద్లాజే ఈ సమాధానమిచ్చారు. ఈ స్కీమ్ కింద 80 లక్షలకుపైగా పెన్షనర్లున్నారు.

News December 2, 2025

హిందూ దేవుళ్లను రేవంత్ అవమానించారు: బండి

image

హిందువులంటే కాంగ్రెస్‌కు ద్వేషమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. <<18447956>>CM రేవంత్<<>> హిందూ దేవుళ్లను అవమానించారని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్ MIMకి మోకరిల్లింది. తమది ముస్లింల పార్టీ అని రేవంత్ కూడా అన్నారు. BRS కూడా హిందువులను కించపరిచింది. కానీ BJP ఇతర మతాల్ని అవమానించలేదు. హిందువులు ఇలా అవమానాన్ని భరిస్తూనే ఉంటారా లేదా ఒక్కటవుతారా’ అని పేర్కొన్నారు.

News December 2, 2025

స్టేట్ ఎలిజిబిలిటీ టెస్టు పరీక్షలు వాయిదా

image

TG: పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్‌ను ఉస్మానియా యూనివర్సిటీ వాయిదా వేసింది. ఈ పరీక్షలకు కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని వర్సిటీ అధికారులు తెలిపారు. కాగా TG SET పరీక్షలు డిసెంబర్ 10, 11, 12 తేదీల్లో నిర్వహించాలని OU ఇంతకు ముందు షెడ్యూల్ విడుదల చేసింది. 3వ తేదీ నుంచి హాల్ టికెట్ల జారీకీ ఏర్పాట్లు చేసింది. అయితే స్థానిక ఎన్నికలు అదే తేదీల్లో రావడంతో వాయిదా వేసింది.