News May 20, 2024

మత ప్రాతిపదికన మైనార్టీలకు రిజర్వేషన్లు ఇవ్వలేదు: జైరాం రమేశ్

image

మతం ఆధారంగా రిజర్వేషన్లు, పౌరసత్వం ఇవ్వకూడదన్న రాజ్యాంగానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటకలో మైనార్టీలకు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించలేదన్నారు. సామాజిక, ఆర్థిక వెనకబాటుతనం ఆధారంగానే ఇచ్చామని పేర్కొన్నారు. బీజేపీ మత ప్రాతిపదికన పౌరసత్వం ఇస్తూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని దుయ్యబట్టారు.

Similar News

News December 2, 2025

590 లీటర్ల అక్రమ మద్యం సీజ్‌: సూర్యాపేట ఎస్పీ

image

గ్రామ పంచాయతీ ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై ఎస్పీ నరసింహ ఉక్కుపాదం మోపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే 50 కేసుల్లో రూ.4.50 లక్షల విలువైన 590 లీటర్ల అక్రమ మద్యం సీజ్‌ చేసి, 291 మందిని బైండోవర్‌ చేసినట్లు తెలిపారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ హక్కును వినియోగించుకోవాలని కోరారు.

News December 2, 2025

నేను కోచ్‌గా ఉంటే బాధ్యత వహించేవాడిని: రవిశాస్త్రి

image

సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను 0-2తో భారత్ కోల్పోవడంపై మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించారు. ఈ విషయంలో గంభీర్‌ను ప్రొటెక్ట్ చేయనని అన్నారు. ‘అతడు 100% బాధ్యత వహించాలి. నేను కోచ్‌గా ఉన్నప్పుడు ఇది జరిగి ఉంటే ఓటమికి మొదటి బాధ్యతను తీసుకునే వాడిని. నిజానికి టీమ్ కూడా అంత ఘోరంగా లేదు. కానీ గువాహటిలో 100-1 నుంచి 130-7కి పడిపోయారు. ఆటగాళ్లు మరింత బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.

News December 2, 2025

సౌత్ సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు

image

సౌత్ సెంట్రల్ రైల్వే(<>సికింద్రాబాద్<<>>)లో స్కౌట్స్& గైడ్స్ కోటాలో 14 గ్రూప్ D, గ్రూప్ C పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. అర్హతగల వారు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఇంటర్, టెన్త్/ITI/NAC ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PwBD, EWS, మహిళలకు రూ.250. రాత పరీక్ష, సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: scr.indianrailways.gov.in