News June 4, 2024
గెలిచేటప్పుడు కాంగ్రెస్కు EVMలపై నోడౌట్స్!

ఓడినప్పుడే కాంగ్రెస్కు ఈవీఎంలపై అభ్యంతరాలు వస్తాయని బీజేపీ రాజస్థాన్ ప్రెసిడెంట్ సీపీ జోషీ విమర్శించారు. ‘కాంగ్రెస్ గెలుస్తున్నప్పుడు ఈవీఎంలపై అనుమానాలు రావు. అప్పుడు సైలెంట్గా ఉంటుంది. లోక్సభలో మాకు స్పష్టమైన మెజార్టీ వస్తుంది. మిత్ర పక్షాలతో కలిసి ఎన్డీయే కూటమి అధికారం చేపడుతుంది’ అని ఆయన అన్నారు. కాగా రాజస్థాన్లో 25 స్థానాల్లో పది చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
Similar News
News December 1, 2025
ఈ కాల్స్/మెసేజ్లను నమ్మకండి: పోలీసులు

పార్సిల్లో డ్రగ్స్ అని ఫేక్ లింక్స్ పంపుతూ సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఈక్రమంలో తెలంగాణ పోలీసులు X వేదికగా ప్రజలను అప్రమత్తం చేశారు. ‘ఎలాంటి వస్తువునూ బుక్ చేయకుండానే పార్సిల్ గురించి కాల్స్, మెసేజ్లు వస్తే నమ్మకండి. ఇలాంటి కాల్స్తో భయపెట్టి ఖాతా ఖాళీ చేస్తారు. పార్సిల్లో డ్రగ్స్, నిషేధిత వస్తువులు ఉన్నాయని భయపెడతారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వీటికి స్పందించకండి’ అని సూచించారు.
News December 1, 2025
తిరుమలలో సహస్ర నామార్చన ఆంతర్యం

తిరుమల శ్రీవారి ఆలయంలో తోమాలసేవ తర్వాత జరిగే ముఖ్య కైంకర్యం సహస్ర నామార్చన. ఇందులో స్వామివారిని 1008 నామాలతో పూజిస్తారు. ఈ నామాల ద్వారా శ్రీమహావిష్ణువు సకల వైభవాలను కీర్తిస్తారు. సకల దుఃఖాలను తొలగించేది, శుభాలను ప్రసాదించేది శ్రీమహావిష్ణువే అనే భావనతో ఈ అర్చన జరుగుతుంది. భక్తులు ఆర్జితసేవ టికెట్ల ద్వారా ఈ పవిత్రమైన అర్చనలో పాల్గొని, స్వామి అనుగ్రహాన్ని పొందవచ్చు. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News December 1, 2025
NINలో ఉద్యోగాలు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రీషన్(NIN)లో 3 ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్-3, 2 పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. బీఎస్సీ(నర్సింగ్, న్యూట్రీషన్, డైటెటిక్స్, హోమ్ సైన్స్, పబ్లిక్ హెల్త్ న్యూట్రీషన్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు mmp_555@yahoo.comకు దరఖాస్తును పంపాలి. projectsninoutsourcing@gmail.comలో సీసీ పెట్టాలి. వెబ్సైట్: https://www.nin.res.in


