News February 28, 2025
వారికే నామినేటెడ్ పోస్టులు: రేవంత్

TG: ప్రభుత్వ నిర్ణయాల్లో పీసీసీ కార్యవర్గ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టీపీసీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని స్పష్టం చేశారు. సమర్థులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పదవులు పొందిన వారు కష్టపడితే రెన్యువల్ చేస్తామని లేకపోతే కొత్తవారికి అవకాశం ఇస్తామని తెలిపారు.
Similar News
News December 20, 2025
భార్యను బాధపెడుతున్నారా! శ్రీనివాసుడికే తప్పలేదు..

భృగు మహర్షి విష్ణుమూర్తి వక్షస్థలాన్ని తన్నినప్పుడు, ఆ అవమానం భరించలేక లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడింది. దీంతో శ్రీహరి అప్పులు చేయాల్సి వచ్చింది. ఇల్లాలి కంట కన్నీరు చిందితే ఆ ఇంటి ఐశ్వర్యం హరించుకుపోతుంది అనేందుకు ఈ వృత్తాంతమే నిదర్శనం. భార్య మనసు నొప్పించకుండా, గౌరవించే ఇంట్లోనే మహాలక్ష్మి స్థిరంగా ఉంటుంది. స్త్రీ గౌరవమే కుటుంబ సౌభాగ్యానికి మూలం. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం క్లిక్ <<-se_10013>>భక్తి<<>>.
News December 20, 2025
రైతుల అకౌంట్లలో ‘బోనస్’ డబ్బులు జమ

TG: రాష్ట్రంలో సన్నవడ్లు పండించిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ జమ చేసింది. నిన్న ఒక్కరోజే 2,49,406 మంది రైతులకు రూ.649.84 కోట్లు విడుదల చేసింది. శుక్రవారం నాటికి మొత్తం 11.45 లక్షల మంది రైతులు 59.74 లక్షల టన్నుల ధాన్యం విక్రయించినట్లు అధికారులు తెలిపారు. వీటికిగానూ రూ.13,833 కోట్లు అన్నదాతల ఖాతాల్లో జమ చేసినట్లు పేర్కొన్నారు. మీకు సన్న వడ్ల ‘బోనస్’ పడిందా?
News December 20, 2025
లింగ మిరియాల కలుపు మొక్కలను ఎలా నియంత్రించాలి?

‘లింగ మిర్యాల’ కలుపు మొక్కలు రబీలో ఉష్ణోగ్రతలు తగ్గాక, అపరాల కోత అనంతరం భూమిలో తేమను పీల్చుకొని పెరిగి పంటకు ఎక్కువ నష్టం కలిగిస్తాయి. ఇవి 2 ఆకుల దశలో ఉన్నప్పుడు ఎకరాకు 200 లీటర్ల నీటిలో ఇమజితాపిర్ 200ml కలిపి పిచికారీ చేసి నివారించవచ్చు. అపరాల కోత తర్వాత లీటరు నీటికి 2,4D సోడియం సాల్ట్ 2 గ్రాములను కలిపి పిచికారీ చేయాలి. భూములను సకాలంలో దున్నడం, 2,3 ఏళ్లకు లోతు దుక్కులతో ఈ సమస్యను తగ్గించవచ్చు.


