News February 28, 2025

వారికే నామినేటెడ్ పోస్టులు: రేవంత్

image

TG: ప్రభుత్వ నిర్ణయాల్లో పీసీసీ కార్యవర్గ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టీపీసీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని స్పష్టం చేశారు. సమర్థులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పదవులు పొందిన వారు కష్టపడితే రెన్యువల్ చేస్తామని లేకపోతే కొత్తవారికి అవకాశం ఇస్తామని తెలిపారు.

Similar News

News December 16, 2025

ప్రముఖ నటుడిని చంపింది కొడుకే?

image

ప్రముఖ హాలీవుడ్ నటుడు రాబ్ రైనర్(78), ఆయన భార్య మిచెల్ సింగర్ రైనర్(68)లను వారి కుమారుడు నిక్ రైనర్ <<18569745>>హత్య<<>> చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిక్ కొంతకాలంగా డ్రగ్స్‌కు బానిసై పేరెంట్స్‌తో కాకుండా గెస్ట్‌హౌజ్‌లో ఉంటున్నాడు. హత్యకు ముందు కూడా హాలిడే పార్టీలో రాబ్‌తో నిక్ గొడవపడినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటన హాలీవుడ్‌లో విషాదం నింపింది.

News December 16, 2025

భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,520 తగ్గి రూ.1,33,860కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,400 పతనమై రూ.1,22,700 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.4,000 తగ్గి రూ.2,11,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News December 16, 2025

EVMలతోనే 4 సార్లు గెలిచా: సుప్రియా సూలే

image

EVMలపై ప్రతిపక్షాలు రిగ్గింగ్ ఆరోపణలు చేస్తున్న వేళ NCP(SP) ఎంపీ సుప్రియా సూలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాటితోనే తాను 4 సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యానని, అందుకే ఎటువంటి అనుమానాలు లేవని చెప్పారు. LSలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడుతూ.. EVMలు, VVPATలను ప్రశ్నించాల్సిన అవసరం లేదన్నారు. మరోవైపు EVMలను దేశంలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వమేనని హోంమంత్రి అమిత్‌ షా గుర్తుచేశారు.