News February 28, 2025

వారికే నామినేటెడ్ పోస్టులు: రేవంత్

image

TG: ప్రభుత్వ నిర్ణయాల్లో పీసీసీ కార్యవర్గ సభ్యులు క్రియాశీలకంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. టీపీసీసీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. కష్టపడి పనిచేసిన వారికి నామినేటెడ్ పోస్టులు ఇస్తామని స్పష్టం చేశారు. సమర్థులకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. పదవులు పొందిన వారు కష్టపడితే రెన్యువల్ చేస్తామని లేకపోతే కొత్తవారికి అవకాశం ఇస్తామని తెలిపారు.

Similar News

News March 24, 2025

పఠాన్‌ కామెంటరీపై నిషేధం..? కారణం అదేనా?

image

మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ గత ఏడాది IPLలో కామెంటరీతో అలరించారు. ఈ ఏడాది మాత్రం ఆయన జాడ లేదు. కామెంటరీ నుంచి ఆయన్ను నిషేధించడమే కారణమని సమాచారం. BCCI వర్గాల సమాచారం ప్రకారం.. గతంలో తనతో విభేదాలున్న ఆటగాళ్లపై ఆయన లైవ్ కామెంటరీలోనే పరోక్షంగా విమర్శలు లేదా కామెంట్లు చేస్తుండటం ప్రసారదారులకు ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆయన్ను కామెంటరీ కాంట్రాక్ట్ నుంచి మినహాయించినట్లు తెలుస్తోంది.

News March 24, 2025

P4 లక్ష్యం అదే: CBN

image

AP: సంపన్నులు-పేదలను ఒకేచోటకు చేర్చడమే P4 లక్ష్యమని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ పథకాన్ని ఉగాది రోజున అమరావతిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. మొదటి దశలో 20 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాష్ట్రంలో 2029 కల్లా పేదరికాన్ని నిర్మూలించాలనేది తమ సంకల్పమని నొక్కి చెప్పారు. లబ్ధి పొందేవారిని బంగారు కుటుంబంగా, సాయం పొందేవారిని మార్గదర్శిగా పిలవాలని సూచించారు.

News March 24, 2025

మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు: ఏసర్ ఇండియా

image

తమ సంస్థలోని మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో ఓ పెయిడ్ లీవ్ ఇవ్వనున్నట్లు ఏసర్ ఇండియా వెల్లడించింది. మాతృక పేరిట ప్రతి నెలా ఈ సెలవును అందిస్తామని తెలిపింది. మహిళల ఆరోగ్యం, శ్రేయస్సుపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది. L&T, స్విగ్గీ, జొమాటో కూడా ఈ తరహా లీవ్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. బిహార్, ఒడిశా, సిక్కిం, కేరళ ప్రభుత్వాలు సైతం ఈ సెలవును అమలు చేస్తున్నాయి.

error: Content is protected !!