News April 24, 2024
సీఎం జగన్ తరఫున నామినేషన్ దాఖలు

AP: పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ జగన్ తరఫున ఆయన బంధువు వైఎస్ మనోహర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను ఆర్వోకు అందజేశారు. ఈ నెల 25న సీఎం జగన్ మరో సెట్ నామినేషన్ వేయనున్నారు. మరోవైపు టెక్కలి అభ్యర్థిగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నామపత్రాలు సమర్పించారు. ఉండి నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా రఘురామకృష్ణరాజు నామినేషన్ దాఖలు చేశారు.
Similar News
News February 12, 2026
సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్.. తేడాలేంటో తెలుసా?

సైకియాట్రిస్ట్, సైకాలజిస్ట్ ఇద్దరూ మానసిక ఆరోగ్యనిపుణులే అయినప్పటికీ చదువు, చికిత్స పద్ధతుల్లో తేడాలు ఉంటాయి. సైకియాట్రిస్టులు డాక్టర్లు (MBBS/MD). వీరు మందుల ద్వారా చికిత్స చేస్తారు. మరోవైపు సైకాలజిస్టులు ప్రొఫెషనల్ వైద్యులు కాదు. డిప్రెషన్, యాంగ్జైటీ లాంటి సమస్యలను టాక్ థెరపీ/కౌన్సెలింగ్ ద్వారా ట్రీట్మెంట్ చేస్తారు. వీరికి మందులు రాసే అధికారం ఉండదు.
News February 12, 2026
ఫలితాలకు ముందే క్యాంపు రాజకీయాలు!

TG: మున్సిపల్ ఫలితాలు వెల్లడికాక ముందే పార్టీలు క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టాయి. తమకు మెజార్టీ వచ్చే స్థానాల్లోని అభ్యర్థులను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నాయి. BRS MLA జగదీశ్ రెడ్డి సూర్యాపేట నుంచి అభ్యర్థులను HYD శివార్లలోని రహస్య ప్రాంతానికి తరలించారు. మంచిర్యాల నుంచి తడోబాకు, ఆదిలాబాద్ నుంచి అయోధ్యకు బీజేపీ అభ్యర్థులను తీసుకెళ్లారు. అటు కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థులను ఇతర ప్రాంతాలకు తరలిస్తోంది.
News February 12, 2026
కిసాన్ రైల్ ద్వారా 34 వేల టన్నుల పంట ఉత్పత్తుల రవాణా

ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటి వరకు కిసాన్ రైల్ ద్వారా 116 సర్వీసులతో 34వేల టన్నుల పంట ఉత్పత్తులను వివిధ రాష్ట్రాలకు రవాణా చేశామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. 2020 AUG 7న కిసాన్ రైళ్లను కేంద్రం ప్రారంభించింది. AP నుంచి మామిడి, అరటి, ఉల్లి ఇతర ఉద్యాన ఉత్పత్తులను బిహార్, అస్సాం, ప.బెంగాల్, ఢిల్లీ, త్రిపురలకు రవాణా చేశామని.. లోక్సభలో TDP MP ప్రభాకర్రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.


