News September 10, 2024

సాయంత్రంలోగా సాధారణ పరిస్థితులు నెలకొనాలి: సీఎం

image

AP: విజయవాడలో ఇవాళ సాయంత్రం వరకు సాధారణ స్థితి నెలకొనేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉత్తరాంధ్రలో భారీ వర్షాల దృష్ట్యా అక్కడి ప్రాంతాల్లో తిరుగుతూ సమీక్షలు నిర్వహించాలని, ఎప్పటికప్పుడు నివేదిక ఇవ్వాలని ఆ ప్రాంత మంత్రులకు సూచించారు. ముంపు ప్రాంతాలకు చెందిన 2.75లక్షల మందికి సహాయక చర్యలు అందించాలన్నారు. వీటి పర్యవేక్షణ బాధ్యతలను మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇచ్చారు.

Similar News

News October 31, 2025

2,162 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

RRC నార్త్ వెస్ట్రర్న్ రైల్వేలో 2,162 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.100, SC, ST, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు. వెబ్‌సైట్: https://rrcjaipur.in

News October 31, 2025

మళ్లీ పెరిగిన బంగారం ధరలు!

image

బంగారం ధరలు గంటల వ్యవధిలోనే <<18156666>>మరోసారి<<>> పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ ఇవాళ మొత్తంగా రూ.1,800 పెరిగి ₹1,23,280కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,650కు ఎగబాకి రూ.1,13,000 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.

News October 31, 2025

BREAKING: భారత్ ఓటమి

image

ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా ఓటమి పాలైంది. భారత్ నిర్దేశించిన 126 పరుగుల టార్గెట్‌ను 6 వికెట్లు కోల్పోయి 13.2 ఓవర్లలోనే ఆసీస్ ఛేదించింది. మార్ష్ 46, ట్రావిస్ హెడ్ 28, ఇంగ్లిస్ 20 పరుగులతో రాణించారు. వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, బుమ్రా తలో 2 వికెట్లు తీశారు. మొదటి టీ20 రద్దవ్వగా.. మూడో టీ20 నవంబర్ 2న జరగనుంది.