News July 4, 2024
వరదలతో ఈశాన్యం అతలాకుతలం

నదులు ఉగ్రరూపం దాల్చడంతో ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. వరస వరదలతో వణికిపోతున్నాయి. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపుర్లో నదుల నీటిమట్టాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయి. అస్సాంలో వరదలకు 8మంది బలయ్యారు. 27 జిల్లాల్లో సుమారు 16 లక్షలమంది తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చైనా, భూటాన్, అరుణాచల్లోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలే దీనికి కారణమని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
Similar News
News December 6, 2025
ఫ్లైట్ల టికెట్ రేట్లు ప్రకటించిన కేంద్రం

ఇండిగో సంక్షోభం వేళ టికెట్ల ఛార్జీలపై కేంద్రం నియంత్రణ చర్యలు చేపట్టింది. దేశీయ విమాన సర్వీసులకు రేట్లను ప్రకటించింది. 500km వరకు టికెట్ ధరను రూ.7,500గా నిర్ధారించింది. 500-1000kmకు రూ.12,000 వరకు, 1000-1500kmకు రూ.15,000 వరకు, 1500km పైన ఉంటే రూ.18,000 వరకు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేసింది. ఇండిగో ఫ్లైట్లు క్యాన్సిల్ కావడంతో మిగతా ఎయిర్లైన్స్ టికెట్ ధరలను భారీగా పెంచేసిన విషయం తెలిసిందే.
News December 6, 2025
కేంద్ర మంత్రి నిర్మల వ్యాఖ్యలపై విమర్శలు

రూపాయి విలువ పతనంపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన <<18486026>>వ్యాఖ్యలు<<>> విమర్శలకు దారి తీస్తున్నాయి. రూపాయి తన స్థాయిని కనుగొనడం అంటే డాలర్కు 100 రూపాయలు దాటడమా అని సెటైర్లు వేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నిరసనలు చేసి, అధికారంలో ఉన్నప్పుడు సమస్యను చిన్నదిగా చూపడం సరికాదని దుయ్యబడుతున్నారు. ఏమైనప్పటికీ చివరికి ధరలు పెంచి సామాన్యుడినే దోచుకుంటారని పలువురు కామెంట్లు చేస్తున్నారు. మీరేమంటారు?
News December 6, 2025
చాట్ జీపీటీతో వ్యవసాయ రంగానికి కలిగే మేలు

సాంకేతిక రంగాన్ని మరో అడుగు ముందుకు తీసుకెళ్లిన ‘చాట్ జీపీటీ’తో వ్యవసాయానికీ మేలే అంటున్నారు నిపుణులు. సాగులో నీళ్లు, ఎరువులు, పురుగు మందులను ఎంతమేర వాడాలి, పంట దిగుబడి పెరగడానికి అవసరమైన సూచనలను ఇది ఇవ్వగలదు. వాతావరణ సమాచారం, మట్టి స్వభావం, పంటకు ఆశించే తెగుళ్లు, చీడపీడలను విశ్లేషించి.. పంట దిగుబడికి అవసరమైన సూచనలతో పాటు పంట నష్టం తగ్గించే సూచనలను ఇది అందిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.


