News April 24, 2024
నార్త్ కొరియా అణు ప్రతిస్పందన డ్రిల్!
తమపై దాడికి వస్తే అణుశక్తితో ప్రతిస్పందించేందుకు ఉత్తర కొరియా తాజాగా డ్రిల్ నిర్వహించింది. దేశాధ్యక్షుడు కిమ్ దగ్గరుండి ఈ ప్రయోగాల్ని పర్యవేక్షించారని ప్రభుత్వ అధికారిక మీడియా కేసీఎన్ఏ ప్రకటించింది. 352 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని తమ రాకెట్లు అత్యంత కచ్చితత్వంతో ఛేదించాయని తెలిపింది. సోమవారం ప్యాంగ్యాంగ్ పలు స్వల్ప శ్రేణి క్షిపణులను ప్రయోగించిందని అంతకుముందు దక్షిణ కొరియా వెల్లడించింది.
Similar News
News January 25, 2025
MHలో భారీ పేలుడు.. 8కి చేరిన మృతుల సంఖ్య
మహారాష్ట్ర భండారాలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో జరిగిన భారీ <<15243613>>పేలుడు<<>> ఘటనలో మృతుల సంఖ్య 8కి చేరినట్లు నాగపూర్ పోలీసులు వెల్లడించారు. ఉ.11గంటలకు ఘటన జరగ్గా, సహాయక చర్యలకు 8గంటల సమయం పట్టిందన్నారు. ఘటన జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఉన్న 13మందిలో 8మంది చనిపోగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయని చెప్పారు. ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేసిన ఆ రాష్ట్ర CM ఫడణవీస్ మృతుల కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
News January 25, 2025
రజినీకాంత్ ‘జైలర్ 2’లో బాలకృష్ణ?
సూపర్స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కనున్న ‘జైలర్ 2’ మూవీ నుంచి ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో టాలీవుడ్ నటుడు నందమూరి బాలకృష్ణ నటించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమవుతుందని సమాచారం. బాలయ్య ప్రస్తుతం బోయపాటి తెరకెక్కించే ‘అఖండ 2’ మూవీతో బిజీగా ఉన్నారు. ఆ తర్వాత గోపీచంద్ మలినేనితో ఓ సినిమా చేయనున్నారు. ఇదే సమయంలో ‘జైలర్ 2’లో నటిస్తారని టాక్.
News January 25, 2025
ఇలాంటి వారు అరటిపండు తినకూడదా?
అరటి పండుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ కొందరు వీటిని తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలర్జీ, శ్వాసకోస సమస్యలు, ఆస్తమా బాధితులు తినకూడదు. మలబద్ధకం ఉన్న వారు తింటే అది మరింత తీవ్రం కావచ్చు. కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఎక్కువగా తినకూడదు. బీపీ, షుగర్ ఉన్నవారు, అధిక బరువుతో సతమతమయ్యేవారు తినకుంటేనే మంచిది. అరటిలో చక్కెర శాతం ఎక్కువ కాబట్టి వీరికి అంతగా మేలు చేయదు.