News September 22, 2024
ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడం లేదా?

ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ చేయకపోతే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినకపోతే మరింత బరువు పెరిగే అవకాశాలు ఉన్నాయి. రక్తంలో చక్కెర స్థాయులు తగ్గి టైప్-2 డయాబెటిస్ బారిన పడొచ్చు. మానసిక ఆరోగ్య సమస్యలు, గుండె జబ్బులు కూడా వచ్చే ఆస్కారం ఉంది. మూడు పూటలా తగినంత భోజనం తీసుకోకపోతే శరీరానికి తగినంత పోషకాలు అందవు. ఎంతో కొంత ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం ఉత్తమం.
Similar News
News January 25, 2026
అగ్నిప్రమాద మృతులకు ఎక్స్గ్రేషియా ప్రకటన

TG: నాంపల్లిలోని ఫర్నిచర్ షాపులో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో <<18951833>>మృతుల<<>> కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్ హరిచందనకు ఆదేశాలు జారీ చేశారు. షాపు యజమాని నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అగ్నిమాపక నిబంధనలు కఠినతరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
News January 25, 2026
హృతిక్ రోషన్కు ఏమైంది?

బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నిన్న చేతి కర్రల సాయంతో నడుస్తూ కనిపించడం ఇప్పుడు అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. బ్లాక్ హుడీ, క్యాప్ ధరించిన ఆయన.. నడవడానికి ఇబ్బంది పడుతూ కనిపించారు. ఫొటోగ్రాఫర్లకు పోజులు ఇవ్వలేదు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ పోస్ట్లు పెడుతున్నారు.
News January 25, 2026
కోహ్లీకి ఆ సత్తా ఉందని సచిన్ చెప్పారు: రాజీవ్ శుక్లా

తన రికార్డులను కోహ్లీ బ్రేక్ చేసే ఛాన్స్ ఉందని సచిన్ గతంలో తనతో చెప్పినట్లు BCCI వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా గుర్తు చేసుకున్నారు. ‘ఓ రోజు నేను సచిన్ ఇంటికి లంచ్కు వెళ్లాను. క్రికెట్లో మీరు చాలా రికార్డులు సృష్టించారని, వాటిని ఎవరు బ్రేక్ చేయగలరని సచిన్ను అడిగా. కోహ్లీకి ఆ సత్తా ఉందన్నారు’ అని రాజీవ్ తెలిపారు. అన్ని ఫార్మాట్లలో సచిన్ 100 సెంచరీలు చేయగా, కోహ్లీ ఇప్పటి వరకు 85 శతకాలు బాదారు.


