News March 29, 2024

పాడేరులో సీనియర్లను కాదని..

image

AP: అల్లూరి జిల్లా పాడేరులో సీనియర్ నేతలను కాదని కిల్లు వెంకటరమేశ్‌కి టీడీపీ టికెట్ ఇచ్చింది. ఆయన పాడేరు మాజీ సర్పంచ్ వెంకటరత్నం కుమారుడు. టీచర్‌గా రాజీనామా చేసి ఇటీవల TDPలో చేరారు. ఈ సీటు కోసం Ex MLA గిడ్డి ఈశ్వరి, మాజీ మంత్రి మణికుమారి, ZP మాజీ ఛైర్‌పర్సన్ కాంతమ్మ, నాగరాజు ప్రయత్నించారు. కాగా ఇక్కడ చివరిగా 1999లో టీడీపీ గెలిచింది. మరి కొత్త అభ్యర్థి రాకతో ఇక్కడ TDP జెండా ఎగురుతుందేమో చూడాలి.

Similar News

News October 5, 2024

రేపు ఢిల్లీకి రేవంత్.. సీఎంల భేటీకి హాజరు

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. తీవ్రవాద నిరోధంపై కేంద్ర హోంశాఖ నిర్వహించనున్న అన్ని రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రుల సమావేశానికి హాజరై ప్రసంగిస్తారు. పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల వరదల పరిహారంగా కేంద్రం రూ.500 కోట్లు ఇవ్వగా, మరింత సాయం చేయాలని నివేదించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలనూ సీఎం కలవొచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.

News October 5, 2024

టీ20 WC: భారత్ సెమీస్ చేరాలంటే?

image

మహిళల టీ20 WCలో నిన్న కివీస్ చేతిలో ఓడిన టీమ్‌ఇండియా -2.900 NRRతో గ్రూప్-Aలో చివరి స్థానంలో ఉంది. సెమీస్ చేరాలంటే మిగతా 3 మ్యాచులు (PAK, SL, AUS) గెలవడంతో పాటు బెటర్ రన్ రేట్ సాధించాలి. లేదంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. బలమైన AUS టీమ్ ఎలాగో SFకి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. భారత్ SF చేరాలంటే AUS మినహా మిగతా 3 జట్లు రెండేసి మ్యాచులు ఓడాలి. వాటి NRR మనకంటే తక్కువుండాలి.

News October 5, 2024

హృతిక్, ఎన్టీఆర్‌తో సాంగ్ షూట్.. అప్పుడేనా?

image

జూ.ఎన్టీఆర్ ఈనెల 9 నుంచి ‘వార్-2’ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈనెల మూడో వారంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌తో ఒక సాంగ్‌ను షూట్ చేయనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ ఈ పాటకు పని చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.