News December 26, 2024
ప్రముఖ రచయిత, డైరెక్టర్ వాసుదేవన్ కన్నుమూత

ప్రముఖ మలయాళ రచయిత, డైరెక్టర్ ఎంటీ వాసుదేవన్ నాయర్(91) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణం పట్ల కేరళ CM విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇవాళ, రేపు సంతాప దినాలుగా ప్రకటించారు. మలయాళ సాహిత్యంలో ఆయన కృషికిగాను 1995లో కేంద్రం జ్ఞానపీఠ అవార్డును బహూకరించింది. పలుచిత్రాలకు స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్గా పనిచేశారు. ఈయన ఎన్నో నవలలు, షార్ట్ స్టోరీలు రాశారు. ఆయన నాలుగు సినిమాలకు నేషనల్ అవార్డులు వచ్చాయి.
Similar News
News January 19, 2026
ఈ సమ్మర్లో మిక్స్డ్ వెదర్

ఈసారి ఎండాకాలంలో మిక్స్డ్ వాతావరణం ఉంటుందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. ఎల్నినో ప్రభావం చూపే అవకాశం ఉందని, ఓ వైపు ఎండలతో పాటు వానలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. 2023కు మించిన ఎండలు, మేతో పాటు జూన్ ప్రారంభంలో తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు చలి ప్రభావం తగ్గుముఖం పడుతుందని తెలిపారు.
News January 19, 2026
చార్ధామ్ యాత్ర.. టెంపుల్స్లోకి మొబైల్స్ బంద్

చార్ధామ్ యాత్రలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంపొందించేందుకు, సౌకర్యవంతమైన దర్శనాన్ని కల్పించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయాల్లోకి మొబైల్స్, కెమెరాలు తీసుకెళ్లడంపై నిషేధం విధించింది. వీటి వినియోగంతో దర్శన సమయంపై ప్రభావం పడుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. మొబైల్స్, కెమెరాలు సేఫ్గా ఉంచడానికి టెంపుల్స్ వద్ద అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
News January 19, 2026
సంతానలేమిని నివారించే ఖర్జూరం

ఖర్జూరాలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయని.. మగవారిలో సంతానలేమి సమస్యను నివారించడంలో ఉపయోగపడతాయని పలు అధ్యయనాల్లో తేలింది. వీటిలో ఉన్న పొటాషియం నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఖర్జూరాల్లో అధికంగా ఉండే పీచు జీర్ణ ప్రక్రియకు మంచిది. ఇందులోని కెరోటనాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే ఐరన్, విటమిన్ C, D, విటమిన్ B కాంప్లెక్స్ గర్భిణులకు మంచివని చెబుతున్నారు.


