News December 26, 2024

ప్రముఖ రచయిత, డైరెక్టర్ వాసుదేవన్ కన్నుమూత

image

ప్రముఖ మలయాళ రచయిత, డైరెక్టర్ ఎంటీ వాసుదేవన్ నాయర్(91) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన మరణం పట్ల కేరళ CM విజయన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇవాళ, రేపు సంతాప దినాలుగా ప్రకటించారు. మలయాళ సాహిత్యంలో ఆయన కృషికిగాను 1995లో కేంద్రం జ్ఞానపీఠ అవార్డును బహూకరించింది. పలుచిత్రాలకు స్క్రిప్ట్ రైటర్, డైరెక్టర్‌గా పనిచేశారు. ఈయన ఎన్నో నవలలు, షార్ట్ స్టోరీలు రాశారు. ఆయన నాలుగు సినిమాలకు నేషనల్ అవార్డులు వచ్చాయి.

Similar News

News January 17, 2025

రూ.3.20 లక్షల ప్రశ్న.. జవాబు తెలుసా?

image

KBCలో అమితాబ్ బచ్చన్ క్రికెట్‌పై మరో ప్రశ్న అడిగారు. 2024 NOVలో టెస్టుల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన మెక్‌కల్లమ్ రికార్డును బద్దలుకొట్టింది ఎవరు అని ప్రశ్నించారు. ఆప్షన్లు A.యశస్వీ జైస్వాల్ B.ఇషాన్ కిషన్ C.సర్ఫరాజ్ ఖాన్ D.శుభ్‌మన్ గిల్. ఈ రూ.3.20 లక్షల ప్రశ్నకు కంటెస్టెంట్ గిల్ అని తప్పుడు జవాబిచ్చారు. దీంతో అతడు రూ.1.60 లక్షలే గెలుచుకోగలిగారు. సరైన జవాబు కామెంట్ చేయండి.

News January 17, 2025

ప్రతి మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్

image

AP: రాష్ట్రంలో ప్రతి నెలా మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎస్ విజయానంద్ తెలిపారు. రేపు కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు ఈ కార్యాక్రమాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో 12 నెలలకు 12 థీమ్‌లతో ఈ ప్రోగ్రామ్‌ను నిర్వహించనున్నారు.

News January 17, 2025

రీఛార్జ్ చేసుకునే వారికి GOOD NEWS

image

దేశంలోని 15 కోట్ల 2G యూజర్లకు ట్రాయ్ గుడ్ న్యూస్ చెప్పింది. వాయిస్ కాల్స్, SMS వంటి బేసిక్ సర్వీసులు మాత్రమే అవసరమయ్యే వీరి కోసం రూ.10తో రీఛార్జ్ ప్లాన్లు తీసుకురావాలని టెలికం ఆపరేటర్లను ఆదేశించింది. దీంతో ఇంటర్నెట్ అవసరం లేని వారు భారీ మొత్తంతో రీఛార్జ్ చేసుకునే తిప్పలు తప్పుతాయి. అలాగే స్పెషల్ టారిఫ్ వోచర్ (STV)ల వ్యాలిడిటీ 90 రోజులు ఉండగా తాజాగా 365 రోజులకు పెంచింది.