News September 27, 2024
తిరుమలకు జగన్ వస్తుంటే మా నేతలకు నోటీసులా?: YCP

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో కూటమి సర్కార్ ఆంక్షలు విధిస్తోందని YCP మండిపడింది. ‘జిల్లాలో 30 యాక్ట్ అమలులో ఉందంటూ మా నాయకులకు అర్ధరాత్రి నుంచే నోటీసులు జారీ చేస్తోంది. గతంలో ఎప్పుడూ ఇలా నోటీసులు ఇచ్చి ఇబ్బందులు పెట్టిన సందర్భాలు లేవు. ఈ ప్రభుత్వం వచ్చాక ఇలాంటివి జరుగుతున్నాయని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు’ అని ట్వీట్ చేసింది.
Similar News
News November 20, 2025
Op Sindoor: రఫేల్ జెట్లపై చైనా తప్పుడు ప్రచారం!

‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో చైనా తప్పుడు ప్రచారం చేసిందని అమెరికా సంచలన ఆరోపణలు చేసింది. ‘ఫేక్ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా నకిలీ ఫొటోలను చైనా వ్యాప్తి చేసింది. రఫేల్ యుద్ధ విమానాలను తమ క్షిపణులతో కూల్చేసినట్లుగా ప్రచారం చేసుకుంది’ అని US-చైనా ఎకనమిక్, సెక్యూరిటీ రివ్యూ కమిషన్
తెలిపింది. రఫేల్ జెట్లపై నమ్మకాన్ని దెబ్బతీసి, తమ J-35 విమానాలకు డిమాండ్ పెంచుకోవాలని చైనా కుట్ర పన్నినట్లు ఆరోపించింది.
News November 20, 2025
పోలి పాడ్యమి కథ వింటే కలిగే ఫలితాలివే..

పోలి పాడ్యమి రోజున నిష్ఠతో దీపారాధన చేసి, పోలి స్వర్గం కథను శ్రద్ధగా వింటే ఈ శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం.
☞ ఈ ఒక్క రోజు పూజతో కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యం సిద్ధిస్తుంది. ☞ స్వర్గ ప్రాప్తి మార్గం సుగమం అవుతుంది. ☞ మానసిక శాంతి, ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతాయి. ☞ కుటుంబంలో సౌఖ్యం, సమృద్ధి పెరిగి, లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ☞ భక్తి, శ్రద్ధల మూలంగా ఈ గొప్ప ఫలాలు అందడం మన అదృష్టం.
News November 20, 2025
పోలి పాడ్యమి కథ వింటే కలిగే ఫలితాలివే..

పోలి పాడ్యమి రోజున నిష్ఠతో దీపారాధన చేసి, పోలి స్వర్గం కథను శ్రద్ధగా వింటే ఈ శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం.
☞ ఈ ఒక్క రోజు పూజతో కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసినంత పుణ్యం సిద్ధిస్తుంది. ☞ స్వర్గ ప్రాప్తి మార్గం సుగమం అవుతుంది. ☞ మానసిక శాంతి, ఆధ్యాత్మిక అభివృద్ధి కలుగుతాయి. ☞ కుటుంబంలో సౌఖ్యం, సమృద్ధి పెరిగి, లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది. ☞ భక్తి, శ్రద్ధల మూలంగా ఈ గొప్ప ఫలాలు అందడం మన అదృష్టం.


