News September 27, 2024

తిరుమలకు జగన్ వస్తుంటే మా నేతలకు నోటీసులా?: YCP

image

AP: మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో కూట‌మి స‌ర్కార్ ఆంక్ష‌లు విధిస్తోందని YCP మండిపడింది. ‘జిల్లాలో 30 యాక్ట్ అమ‌లులో ఉందంటూ మా నాయకులకు అర్ధ‌రాత్రి నుంచే నోటీసులు జారీ చేస్తోంది. గ‌తంలో ఎప్పుడూ ఇలా నోటీసులు ఇచ్చి ఇబ్బందులు పెట్టిన సంద‌ర్భాలు లేవు. ఈ ప్ర‌భుత్వం వచ్చాక ఇలాంటివి జ‌రుగుతున్నాయ‌ని టీటీడీ మాజీ ఛైర్మన్ భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డి విమ‌ర్శించారు’ అని ట్వీట్ చేసింది.

Similar News

News November 13, 2025

‘ఓం’ అని పలికితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

image

ఓంకార నాదంతో ఎన్నో ఉపయోగాలున్నాయి. ఈ పవిత్ర శబ్దం, విశ్వ నాదం(432 Hz)తో ఏకమై కొత్త శక్తిని సృష్టిస్తుంది. దీనివల్ల మన శరీరంలోని చక్రాలు ఉత్తేజితమై, అంతరంగాన్ని శుద్ధి చేస్తాయి. ఫలితంగా మానసిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి వంటి సమస్యలు దూరమవుతాయి. ఏకాగ్రత పెరుగుతుంది. అందుకే నిత్యం ఓంకార పఠనం చేయాలని ఆధ్యాత్మికవేత్తలు చెబుతుంటారు.
☛ ఇలాంటి ఆసక్తికర ఆధ్యాత్మిక కథనాల కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.

News November 13, 2025

124 పోస్టులకు SAIL నోటిఫికేషన్

image

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (<>SAIL<<>>) 124 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతగల అభ్యర్థులు ఈ నెల 15 నుంచి డిసెంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 28ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.sail.co.in

News November 13, 2025

డెయిరీ ఫామ్ నిర్వహణకు పాడి పశువులను ఎప్పుడు కొనాలి?

image

డెయిరీ ఫామ్ ప్రారంభించడానికి ముందు కొంత భూమిలో హైబ్రిడ్ నేపియర్, గినీ గడ్డి, జొన్న లాంటి పశుగ్రాసాలను.. మరి కొంత భాగంలో అలసంద, పిల్లిపెసర, లూసర్న్ లాంటి చిక్కుడు జాతి పశుగ్రాసాలను సాగుచేయాలని వెటర్నరీ నిపుణులు సూచిస్తున్నారు. సుబాబుల్, అవిశ చెట్లను ఫామ్ చుట్టూ కంచెలా వేయాలి. ఇలా పశుగ్రాసాన్ని పెంచి, షెడ్డులు కట్టిన తర్వాత పరికరాలు, మందులు కొనుగోలు చేశాక పాడి పశువులను కొనాలని సలహా ఇస్తున్నారు.