News January 1, 2025
పేర్ని నాని భార్యకు మళ్లీ నోటీసులు

AP: మచిలీపట్నంలో రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని నాని సతీమణి జయసుధకు స్థానిక పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. మ. 2 గంటలకు విచారణకు రావాలని పేర్కొన్నారు. ఆమె ఇంట్లో లేకపోవడంతో గోడకు నోటీసులు అంటించారు. ఇదే కేసులో ఆమెకు ముందస్తు బెయిల్ ఇచ్చిన కృష్ణా జిల్లా కోర్టు విచారణకు సహకరించాలని ఆదేశించింది. దీంతో ఇవాళ్టి విచారణకు ఆమె హాజరవుతారా? లేదా? అనేది చూడాల్సి ఉంది.
Similar News
News November 27, 2025
ధర్మారంలో ఘనంగా మల్లన్న పట్నాలు

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మల్లన్న గుట్టపై బుధవారం పర్వతాల మల్లన్న పట్నాలు, బోనాలు యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఒగ్గుడోలు కళాకారులు, భక్తుల కోలాటాల మధ్య ఈ ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో భాగంగా ఉదయం యాదవులు డీజే సౌండ్స్, మల్లన్న గీతాలతో శోభాయాత్ర నిర్వహించి, పసుపు బండారితో ఊరేగింపుగా మల్లన్న గుట్ట పైకి వెళ్లారు. అనంతరం పట్నం వేసి బోనాలు సమర్పించారు.
News November 27, 2025
ధర్మారంలో ఘనంగా మల్లన్న పట్నాలు

పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని మల్లన్న గుట్టపై బుధవారం పర్వతాల మల్లన్న పట్నాలు, బోనాలు యాదవ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఒగ్గుడోలు కళాకారులు, భక్తుల కోలాటాల మధ్య ఈ ఉత్సవం ఘనంగా జరిగింది. ఈ ఉత్సవంలో భాగంగా ఉదయం యాదవులు డీజే సౌండ్స్, మల్లన్న గీతాలతో శోభాయాత్ర నిర్వహించి, పసుపు బండారితో ఊరేగింపుగా మల్లన్న గుట్ట పైకి వెళ్లారు. అనంతరం పట్నం వేసి బోనాలు సమర్పించారు.
News November 27, 2025
పెద్దపల్లి: ‘సర్పంచ్ రిజర్వేషన్లలో బీసీలకు మోసం’

సర్పంచ్ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 17% బీసీ రిజర్వేషన్లలో బీసీలకు భారీ మోసం జరిగిందని టీఆర్పీ జిల్లా అధ్యక్షుడు ఉదయ్ ఆరోపించారు. రాష్ట్రంలోని 12,375 గ్రామాలలో కేవలం 2,176 గ్రామాలు మాత్రమే బీసీలకు కేటాయించడం సిగ్గుచేటన్నారు. బీసీలకు అన్యాయం జరుగుతుంటే బీసీ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీసీ ఎమ్మెల్యేలు తమ పదవులకు తక్షణమే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


