News February 22, 2025

వైసీపీ ఎమ్మెల్యేకు నోటీసులు

image

AP: భూ ఆక్రమణ ఆరోపణలపై రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డి, కుటుంబీకులకు జాయింట్ కలెక్టర్ నోటీసులు ఇచ్చారు. ఇవాళ రాయచోటిలోని కలెక్టరేట్‌లో విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా ఆకేపాడు, మందపల్లి గ్రామాల్లో వందలాది ఎకరాలను ఆకేపాటి కుటుంబం ఆక్రమించిందని టీడీపీ నేతలు ఆరోపించడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Similar News

News November 14, 2025

వాళ్లు ఏ వేషంలో వచ్చినా అవకాశం రాదు: అమిత్ షా

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA గెలుపుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఇది వికసిత్ బిహార్‌పై నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒక్కరి విజయమని అన్నారు. జంగిల్ రాజ్, బుజ్జగింపు రాజకీయాలు చేసే వారు ఏ వేషంలో వచ్చినా దోచుకునేందుకు అవకాశం లభించదని ట్వీట్ చేశారు. పని తీరు ఆధారంగా ప్రజలు తీర్పు చెప్పారని పేర్కొన్నారు. బిహార్ ప్రజల ప్రతి ఓటు మోదీ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకానికి చిహ్నమని చెప్పారు.

News November 14, 2025

టెట్ నోటిఫికేషన్ విడుదల

image

తెలంగాణ <>TET<<>>-2026 నోటిఫికేషన్ విడుదలైంది. D.El Ed., D.Ed., B.Ed., Language Pandit రేపటి నుంచి ఈ నెల 29 వరకు అప్లై చేసుకోవచ్చు. జనవరి 3 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రభుత్వ టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి. B.Ed విద్యార్హత కలిగిన SGTలు పేపర్ 1పరీక్ష రాయవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.750. రెండు పేపర్లకు రూ.1000. వెబ్‌సైట్: https://tgtet.aptonline.in/tgtet/

News November 14, 2025

ప్రాజెక్టులకు 50వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్: CM

image

AP: పరిశ్రమల ఏర్పాటు కోసం 50వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్ అందుబాటులో ఉంచామని CM CBN చెప్పారు. CII సదస్సు పెట్టుబడుల కోసమే కాదని, మేధో చర్చల కోసం ఏర్పాటు చేశామన్నారు. సంప్రదాయాలు, చేతివృత్తులను ప్రోత్సహించేలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లను నెలకొల్పుతున్నామన్నారు. డేటా లేక్, రియల్ టైమ్ డేటా ద్వారా వేగంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నామని చెప్పారు. అనేక దేశాల ప్రతినిధులు సదస్సుకు రావటం సంతోషం కలిగిస్తోందన్నారు.