News January 22, 2025
వైద్య విద్యలో ప్రవేశాలకు నోటిఫికేషన్

TG: ఇన్ సర్వీస్ అభ్యర్థులకు వైద్య విద్యలో PG ప్రవేశాలకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఇచ్చింది. నీట్ పీజీ-2024లో క్వాలిఫై అయిన వారు దరఖాస్తుకు అర్హులు. ఈ నెల 23న ఉ.10 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో స్పాట్ రిజిస్ట్రేషన్, సర్టిఫికెట్ వెరిఫికేషన్కు హాజరుకావాలని సూచించింది. కాగా తెలంగాణ బయట ఎంబీబీఎస్ పూర్తి చేసి, 9, 10, ఇంటర్ రాష్ట్రంలో చదివిన వారికే ఈ అవకాశం ఉంది.
Similar News
News February 11, 2025
ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు కోహ్లీనే: గేల్

ప్రస్తుతం ప్రపంచంలో అత్యుత్తమ ఆటగాడు విరాట్ కోహ్లీయేనని వెస్టిండీస్ మాజీ క్రికెటర్ క్రిస్ గేల్ అభిప్రాయపడ్డారు. రికార్డులే ఆ మాట చెబుతాయని ఓ ఇంటర్వ్యూలో అన్నారు. ‘ఫార్మాట్లతో సంబంధం లేకుండా ఇప్పటికీ విరాటే అత్యుత్తమ ఆటగాడు. ఆయన ఫామ్ కొంచెం డౌన్ అయిందంతే. తిరిగి పుంజుకుని కెరీర్ను బలంగా ముగిస్తారని అనుకుంటున్నా. ఇక రోహిత్ అద్భుతమైన ఎంటర్టైనర్. సిక్సుల్లో ఆయనే ఇప్పుడు కింగ్’ అని కొనియాడారు.
News February 11, 2025
రంగరాజన్పై దాడిని ఖండించిన చంద్రబాబు

AP: చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్పై దాడిని సీఎం చంద్రబాబు ఖండించారు. నాగరిక సమాజంలో హింసకు తావులేదని హితవు పలికారు. గౌరవప్రదమైన చర్చలు, భిన్నాభిప్రాయాలకు స్థానం ఉండాలి కానీ హింసకు కాదని వ్యాఖ్యానించారు. కాగా ఇటీవల రంగరాజన్పై దాడిని టీజీ సీఎం రేవంత్, కేటీఆర్, పవన్ కళ్యాణ్ తదితర రాజకీయ ప్రముఖులు ఖండించిన విషయం తెలిసిందే.
News February 11, 2025
డయాబెటిస్ ఉన్నా ఈ పండ్లు తినొచ్చు

తీపి పండ్లు తినాలని అనిపిస్తున్నా డయాబెటిస్ ఎక్కువవుతుందని మధుమేహులు భయపడుతుంటారు. రాస్ప్బెరీ, అవకాడో, ఆప్రికాట్, బ్లాక్బెరీ, పుచ్చకాయల్ని వారు తినొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇతర పండ్లతో పోలిస్తే వీటిలో చక్కెర శాతం తక్కువగా ఉంటుందని, మేలు చేకూర్చే కొవ్వులు ఎక్కువ ఉంటాయని వివరిస్తున్నారు. అయితే మధుమేహులు తమ షుగర్ స్థాయుల్ని బట్టి వైద్యుల సూచన మేరకు డైట్ అనుసరించాలని సూచిస్తున్నారు.