News August 23, 2024

అంబుజా సిమెంట్స్‌లో షేర్లు కొన్న NPS, SBI లైఫ్

image

అంబుజా సిమెంట్స్‌‌లో షేర్ల అమ్మకం ద్వారా అదానీ కుటుంబం రూ.4,251 కోట్లు సమీకరించిందని బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. చివరి 5 సెషన్లలో రూ.20వేల కోట్ల విలువైన బ్లాక్ డీల్స్ జరిగినట్టు పేర్కొన్నాయి. GQG పాట్నర్స్ రూ.1679 కోట్లు, NPS రూ.525 కోట్లు, SBI లైఫ్ రూ.500 కోట్ల మేర షేర్లను కొన్నాయి. గ్రూపు కంపెనీల్లో 3% వాటా తగ్గించుకొని, ఆ డబ్బును ఇన్ఫ్రా రంగంలో పెట్టుబడి పెట్టాలని అదానీ కుటుంబం భావిస్తోంది.

Similar News

News November 27, 2025

NIT వరంగల్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

image

<>NIT <<>>వరంగల్‌ 2 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేయనుంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 12న ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి ఎంఏ (ఫ్రెంచ్, జర్మన్), పీహెచ్‌డీ ఉత్తీర్ణులు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.70వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://nitw.ac.in/

News November 27, 2025

పంచాయతీ ఎన్నికలు.. జీవో నం.46 అంటే ఏంటి?

image

TG: స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ 22న జీవో నం.46ను తీసుకొచ్చింది. దీని ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కలిపి గరిష్ఠంగా 50 శాతం మించకూడదు. దీని ప్రకారం బీసీలకు 22% రిజర్వేషన్లు మాత్రమే దక్కుతాయని బీసీ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ జీవోను <<18402975>>సవాల్ చేస్తూ హైకోర్టులో<<>> పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై రేపు విచారణ జరగనుంది.

News November 27, 2025

పవిత్ర పంబా నది విశేషాలు మీకు తెలుసా?

image

పంబా నది ప్రస్తావన త్రేతాయుగం నుంచి ఉంది. అందుకే పవిత్ర నదిగా దీన్ని పరిగణిస్తారు. ఇది ఔషధ మూలికల సారంతో ప్రవహిస్తుందని నమ్ముతారు. ఈ నదిలో స్నానం చేస్తే వన యాత్ర అలసట మాయమవుతుందట. యాత్రలో భాగంగా స్వాములు ఇక్కడ స్నానమచారిస్తుంటారు. ఇక్కడ పితృకర్మలు నిర్వహిస్తే 7 తరాల వారికి మోక్షం లభిస్తుందని చెబుతారు. ఇక్కడ కొలువైన కన్నెమూల మహా గణపతిని దర్శించి యాత్రను కొనసాగిస్తారు. <<-se>>#AyyappaMala<<>>