News December 17, 2024
ఇకపై ప్రవేశ పరీక్షల నిర్వహణకే NTA: కేంద్ర మంత్రి

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. ఇకపై విద్యాసంస్థల్లో ప్రవేశాలకు మాత్రమే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పరీక్షలను నిర్వహిస్తుందని చెప్పారు. 2025 నుంచి ఎలాంటి రిక్రూట్మెంట్ పరీక్షలు నిర్వహించబోదని తెలిపారు. విద్యావ్యవస్థను సమర్థవంతంగా పనిచేసేలా తీసుకుంటున్న సంస్కరణల్లో ఇది భాగమని పేర్కొన్నారు. వచ్చే ఏడాది NTAను పునర్నిర్మిస్తామన్నారు.
Similar News
News November 11, 2025
మళ్లీ తల్లి పాత్రలో నటించను: మీనాక్షి చౌదరి

తన గురించి ఏమైనా చెప్పాలంటే సోషల్ మీడియా ద్వారా వెల్లడిస్తానని, రూమర్లు సృష్టించాల్సిన అవసరం లేదని హీరోయిన్ మీనాక్షి చౌదరి తెలిపారు. ‘లక్కీ భాస్కర్ కథ నచ్చి తల్లి క్యారెక్టర్ చేశా. ఇక అటువంటి పాత్రలు వస్తే నిర్మొహమాటంగా నో చెప్పేస్తా. మెగాస్టార్ చిరంజీవితో కలిసి నటిస్తున్న ‘విశ్వంభర’ నా కెరీర్లో స్పెషల్ చాప్టర్గా నిలిచిపోతుంది. సీనియర్ హీరోలతో నటించడానికి ఇబ్బంది లేదు’ అని మీనాక్షి చెప్పారు.
News November 11, 2025
సనాతన ధర్మ భావాలను ఎగతాళి చేస్తే..: పవన్

AP: సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటుకు సమయం ఆసన్నమైందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు తిరుమల ఓ పుణ్యక్షేత్రమే కాకుండా ఆధ్యాత్మిక కేంద్రం. ఆ లడ్డూకు ఎంతో పవిత్రత ఉంది. ఏడాదికి సగటున రెండున్నర కోట్ల మంది భక్తులు వస్తుంటారు. విశ్వాసం, సనాతన ధర్మ భావాలను ఎవరైనా ఎగతాళి చేస్తే అది ఆధ్యాత్మిక నమ్మకాన్ని దెబ్బతీస్తుంది’ అని ట్వీట్ చేశారు.
News November 11, 2025
సర్వే ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ జియో ఇన్ఫర్మేటిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ(NIGST), సర్వే ఆఫ్ ఇండియాలో 6 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి MBA, పీజీ డిప్లొమా, ఎంఎస్సీ, ఎంటెక్, ఎంఈ, PhD ఉత్తీర్ణతతో పాటు నెట్ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 5 వరకు అప్లై చేసుకోవచ్చు. యంగ్ ప్రొఫెషనల్, రీసెర్చ్ అసోసియేట్, FRF పోస్టులు ఉన్నాయి. వెబ్సైట్: https://surveyofindia.gov.in


