News April 24, 2024

4 ప్రశ్నలకు మార్కులు కలపనున్న NTA

image

JEE మెయిన్ సెషన్-2 పరీక్ష ఫైనల్ ‘కీ’ నిన్న రిలీజైంది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పులు చేసిన NTA.. 4 ప్రశ్నలకు సంబంధించి విద్యార్థులకు మార్కులు కలపనుంది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 25న ఫలితాలు వెల్లడిస్తామని ప్రకటించినప్పటికీ.. ఇవాళే రిజల్ట్స్ రిలీజ్ అవుతాయని తెలుస్తోంది. APR 4 నుంచి 12 వరకు ఈ పరీక్ష జరిగింది. కటాఫ్ మార్కులు పొందిన 2.50 లక్షల మందికి JEE అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసే వీలు కల్పిస్తారు.

Similar News

News January 16, 2025

సంక్రాంతి.. APSRTCకి భారీ ఆదాయం

image

AP: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపిన ఏపీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం వచ్చింది. జనవరి 8 నుంచి 16 వరకు 3,400 సర్వీసులను తిప్పగా రూ.12 కోట్ల అదనపు ఆదాయం సమకూరింది.. ఈ నెల 20 వరకు మరో 3,800 బస్సులను నడపనుండగా రూ.12.5 కోట్లు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పండుగ సీజన్‌లో దాదాపు 4 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చినట్లు చెబుతున్నారు.

News January 16, 2025

సైఫ్ అలీఖాన్‌పై దాడి.. సంచలన విషయాలు

image

హీరో సైఫ్ అలీఖాన్‌పై దాడికి యత్నించిన నిందితుడు తొలుత అతడి కొడుకు జేహ్(4) బెడ్రూమ్‌లోకి ప్రవేశించినట్లు పోలీసులు FIR కాపీలో తెలిపారు. ‘బాబు సంరక్షణ కోసం ఉన్న నర్సు నిందితుడిని నిలువరించింది. దీంతో అతడు ఆమెపై దాడి చేయడంతో గాయాలయ్యాయి. అలికిడి విని సైఫ్, కరీనా ఆ గదిలోకి వెళ్లారు. పెనుగులాటలో దుండగుడు సైఫ్‌ను కత్తితో పొడిచి పారిపోయాడు’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం సైఫ్ ఆసుపత్రిలో కోలుకుంటున్నారు.

News January 16, 2025

J&Kలో మిస్టరీ: నెలన్నరలో ఒకే ఊరిలో 15 మంది మృతి

image

J&K రాజౌరీ(D)లోని బుధాల్‌లో మిస్టరీ మరణాలు కలవరపెడుతున్నాయి. నెలన్నరలోనే 15 మంది చనిపోవడంతో ప్రభుత్వం SITను ఏర్పాటుచేసింది. DEC 7న విందు ఆరగించిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు, DEC 12న మరో సహపంక్తి భోజనం చేసిన వారిలో ముగ్గురు, JAN 12న మరొకరు మృతిచెందారు. ఇలా పలు ఘటనల్లో 15 మంది చనిపోయారు. ఆహార, నీటి నమూనాల్లో విష పదార్థాలు ఉండటంతో అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.