News May 10, 2024
పాకిస్థాన్ను గౌరవించకుంటే అణు బాంబు వేస్తారు: కాంగ్రెస్ నేత

సైనిక చర్యలతో పాకిస్థాన్ను కవ్వించాలని చూస్తే అది భారత్కే నష్టమని కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆ దేశంతో దౌత్యపరమైన చర్చలకే భారత్ ప్రాధాన్యం ఇవ్వాలి. వారి వద్ద కూడా ఆటమ్ బాంబులు ఉన్నాయి. లాహోర్పై ఆటమ్ బాంబు వేయాలని చూస్తే అమృత్సర్కు 8 సెకన్లలో రేడియేషన్ పాకుతుంది. మనం గౌరవిస్తే వారు ప్రశాంతంగా ఉంటారు. రెచ్చగొడితే వారు మనపై అణుబాంబు వేయొచ్చు’ అని పేర్కొన్నారు.
Similar News
News March 31, 2026
కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను తగ్గిస్తాం: మంత్రి సత్యకుమార్

AP: రాష్ట్రంలో జనాభా స్థిరీకరణకు చర్యలు చేపట్టనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. సంతానోత్పత్తి రేటు క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత జనాభా నియంత్రణ విధానానికి స్వస్తి పలికి నూతన ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటున్న మహిళల శాతం 70గా ఉండగా దానిని 50%కు తగ్గిస్తామన్నారు. కాగా రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 1.5గా ఉంది.
News March 31, 2026
యుద్ధం.. భారీగా పెరగనున్న ధరలు

పశ్చిమాసియా యుద్ధం నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం చూపించనుంది. AP, TGలో సిమెంట్ బస్తా ధర రూ.50 పెరగనున్నట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. వారంలో ఇది అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రిటైల్ మార్కెట్లో బస్తా రూ.280-320 మధ్య ఉండగా పెంపు తర్వాత రూ.320-370కి చేరనుంది. సిమెంట్ కంపెనీలు వాడే పెట్రోలియం కోక్ 130 డాలర్ల నుంచి 165కు చేరడం, ఇండస్ట్రియల్ డీజిల్ రేట్ రూ.23.75 పెంచడం ధరల పెరుగుదలకు కారణం.
News March 31, 2026
ఎలాంటి భోజనం తృప్తినిస్తుంది?

గంగిగోవు పాలు గరిటెడైనా చాలు
కడివెడైన నేమి ఖరము పాలు
భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ! వినుర వేమ!!
తాత్పర్యం: గాడిద పాలు కడవ నిండా ఉన్నా గరిటెడు ఆవు పాలతో సమానం కాదు. అలాగే ప్రేమ, భక్తితో పెట్టిన కొద్ది భోజనమైనా ఎంతో తృప్తిని ఇస్తుందని అర్థం.
<<-se>>#PADHYAM<<>>


