News May 10, 2024

పాకిస్థాన్‌ను గౌరవించకుంటే అణు బాంబు వేస్తారు: కాంగ్రెస్ నేత

image

సైనిక చర్యలతో పాకిస్థాన్‌ను కవ్వించాలని చూస్తే అది భారత్‌కే నష్టమని కాంగ్రెస్ నేత మణి శంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఆ దేశంతో దౌత్యపరమైన చర్చలకే భారత్ ప్రాధాన్యం ఇవ్వాలి. వారి వద్ద కూడా ఆటమ్ బాంబులు ఉన్నాయి. లాహోర్‌పై ఆటమ్ బాంబు వేయాలని చూస్తే అమృత్‌సర్‌‌కు 8 సెకన్లలో రేడియేషన్‌ పాకుతుంది. మనం గౌరవిస్తే వారు ప్రశాంతంగా ఉంటారు. రెచ్చగొడితే వారు మనపై అణుబాంబు వేయొచ్చు’ అని పేర్కొన్నారు.

Similar News

News February 8, 2025

EC డేటా: BJP 40, AAP 30

image

ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం ఢిల్లీ ఫలితాల్లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. మొత్తం 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మెజారిటీ మార్క్ 36 కన్నా ఇది 7 స్థానాలు ఎక్కువ. ఆమ్‌ఆదీ పార్టీ 30 సీట్లతో ముందుకు సాగుతోంది. బీజేపీ ఓట్ షేరు 48.03 శాతంగా ఉంది. ఆప్ 42.58 శాతం సాధించింది. కాంగ్రెస్‌కు 6.74% ఓట్‌షేర్ రావడం గమనార్హం.

News February 8, 2025

Delhi Results: ఇండీ కూటమిపై ఒమర్ అబ్దుల్లా విమర్శలు

image

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఘోర ఓటమి దిశగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇండీ కూటమిపై విమర్శలు గుప్పించారు. రామాయణం సీరియల్‌కు సంబంధించిన జిఫ్‌ను షేర్ చేశారు. ‘జీవితమంతా కొట్టుకుంటూ ఉండండి. ఒకరినొకరు అంతం చేసుకోండి’ అని అందులో ఉంది. ఇండియా కూటమి పార్టీలు కొట్లాడుకుంటుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయంటూ పరోక్షంగా విమర్శించారు.

News February 8, 2025

ముస్లిం నియోజకవర్గాల్లో బీజేపీకి కలిసొచ్చిన వ్యూహం ఇదే

image

ఢిల్లీలోని ముస్లిం ఆధిపత్య 7 నియోజకవర్గాల్లో బీజేపీ దూకుడు ప్రదర్శించడానికి ఆ పార్టీ ముస్లిం మోర్చా ‘సైలెంట్ క్యాంపెయిన్’ బాగా హెల్ప్ చేసింది. వీరు 4-7 సభ్యుల బృందాలుగా విడిపోయి ప్రతి ఇంటికీ తిరిగారు. ‘లాభార్థి యోజనా’ ఫామ్స్ పేరుతో వివరాలు సేకరిస్తూ ఆప్‌పై ఆగ్రహాన్ని గమనించారు. మరోవైపు ప్రతి నియోజకవర్గంలో 70-80 చిన్న చిన్న మీటింగ్స్ పెట్టి తమకు అవకాశం ఇవ్వాలని కోరడం కలిసొచ్చినట్టు తెలుస్తోంది.

error: Content is protected !!