News January 9, 2025

అధికారుల సేవ TTD కంటే TDPకే ఎక్కువ: అంబటి

image

AP: చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తిరుపతిలో ఘోరం జరిగిందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ‘అధికారులు టీటీడీ కంటే టీడీపీకే ఎక్కువ సేవ చేస్తున్నారు. ఆఫీసర్లపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసి ఏం సాధించారు? అధికారులను తిడితే సమస్యలు పరిష్కారమవుతాయా? ఇదే నిర్లక్ష్యం కొనసాగితే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇవ్వాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

Similar News

News November 8, 2025

నేరేడుచర్ల: ఈతకెళ్లి బాలిక గల్లంతు

image

మూసీ నదిలో ఈతకు వెళ్లి సుస్మిత (13) అనే బాలిక గల్లంతైన విషాద ఘటన నేరేడుచర్ల మండలం సోమారంలో శనివారం సాయంత్రం జరిగింది. గ్రామంలోని సోమప్ప సోమేశ్వరాలయం వెనుక ఉన్న నదిలో ముగ్గురు చిన్నారులు ఈతకు వెళ్లగా, సుస్మిత నీట మునిగింది. మిగతా ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. గల్లంతైన బాలిక కోసం రెస్క్యూ టీంను రంగంలోకి దించినట్లు ఎస్సై రవీందర్ తెలిపారు. బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి.

News November 8, 2025

ALERT: డిజిటల్ గోల్డ్ కొంటున్నారా?

image

డిజిటల్, ఆన్‌లైన్‌ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టేవారు అప్రమత్తంగా ఉండాలని సెబీ హెచ్చరించింది. ఈ విధానం తమ పరిధిలోకి రాదని, మోసాలకు తాము బాధ్యత వహించలేమని స్పష్టం చేసింది. వాటిలో కౌంటర్ పార్టీ, ఆపరేషనల్ రిస్కులు ఉంటాయని పేర్కొంది. దీని వల్ల పెట్టుబడిదారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని తెలిపింది. ETF, EGRsలే తమ పరిధిలోకి వస్తాయని, వాటి ద్వారా గోల్డ్ కొనుగోలు చేయడం సురక్షితమని వెల్లడించింది.

News November 8, 2025

ఆ MLAలు ఏం చేస్తున్నట్లు?

image

AP: CM <<18235116>>తాజా వ్యాఖ్యల<<>>తో ఆ ‘48మంది MLAలు’ ఎవరు? అనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది. నెలలో ఒకట్రెండు రోజుల పాటు పెన్షన్లు, CMRF చెక్కుల పంపిణీలోనూ పాల్గొనలేరా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఓట్ల కోసం ప్రజల చుట్టూ తిరిగే నేతలు గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా ఏం చేస్తున్నట్లు? అని నిలదీస్తున్నారు. అయితే MLAలపై చర్యలు తీసుకోవడం సాధ్యమేనా? అని అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.