News January 9, 2025

అధికారుల సేవ TTD కంటే TDPకే ఎక్కువ: అంబటి

image

AP: చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తిరుపతిలో ఘోరం జరిగిందని వైసీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ‘అధికారులు టీటీడీ కంటే టీడీపీకే ఎక్కువ సేవ చేస్తున్నారు. ఆఫీసర్లపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసి ఏం సాధించారు? అధికారులను తిడితే సమస్యలు పరిష్కారమవుతాయా? ఇదే నిర్లక్ష్యం కొనసాగితే మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. క్షతగాత్రులకు ఒక్కొక్కరికి రూ.25 లక్షలు ఇవ్వాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.

Similar News

News January 18, 2025

అన్నకు సవాల్ విసిరిన మంచు మనోజ్

image

మంచు బ్రదర్స్ మధ్య మాటల యుద్ధం మరింత పెరుగుతోంది. నిన్న కుక్క-సింహం అంటూ ట్వీట్స్ చేసుకున్న ఈ అన్నదమ్ములు.. సై అంటే సై అంటూ ఈరోజు మనోజ్ సవాల్ విసిరారు. ‘దా.. కూర్చుని మాట్లాడుదాం. మహిళలు, నాన్న, స్టాఫ్‌ను పక్కన పెట్టి మనం కలుసుకుందాం. ఒట్టేసి చెబుతున్నా.. నేనొక్కడినే వస్తా. నువ్వు ఎవరినైనా, ఎంతమందినైనా తీసుకొచ్చుకో. లేకపోతే మనం హెల్తీ ఓపెన్ డిబేట్ పెట్టుకుందాం’ అని ట్వీట్ చేశారు.

News January 18, 2025

గ్రూప్-2 కీ విడుదల

image

TG: గ్రూప్-2 ప్రిలిమినరీ కీ విడుదలైంది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 22 సా.5 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అధికారులు సూచించారు. రాష్ట్రంలో 783 పోస్టుల కోసం గతేడాది డిసెంబర్ 15, 16 తేదీల్లో గ్రూప్-2 నిర్వహించారు. సైట్: <>https://websitenew.tspsc.gov.in/<<>>

News January 18, 2025

బీదర్, అఫ్జల్‌గంజ్‌ కాల్పుల కేసులో పురోగతి

image

బీదర్‌లో <<15169507>>ఏటీఎం డబ్బులు<<>> చోరీ చేసి, HYD అఫ్జల్‌గంజ్‌లో <<15172705>>కాల్పులు జరిపిన<<>> నిందితుల్లో ఒకరిని పోలీసులు గుర్తించారు. బిహార్‌కు చెందిన మనీశ్, మరికొందరు కలిసి ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారని, ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని ఓ బ్యాంకులో రూ.70లక్షలు చోరీ చేసినట్లు దర్యాప్తులో తేలింది. మనీశ్, అతని ముఠా కోసం తెలంగాణ, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్ పోలీసులు గాలిస్తున్నారు.