News January 21, 2025

దిల్ రాజు భార్యను బ్యాంకుకు తీసుకెళ్లిన అధికారులు

image

HYDలోని నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఉదయం నుంచి <<15210747>>ఐటీ సోదాలు <<>>కొనసాగుతున్నాయి. విచారణలో భాగంగా ఆయన భార్య తేజస్వినిని అధికారులు బ్యాంకుకు తీసుకెళ్లారు. SVC సంస్థ బ్యాలెన్స్ షీట్లు, ITR వివరాలను పరిశీలిస్తున్నారు. దిల్ రాజ్‌కు చెందిన రియల్ ఎస్టేట్‌ సంస్థలోనూ తనిఖీలు జరుగుతున్నాయి. అటు మైత్రి మూవీ మేకర్స్, నిర్మాత అభిషేక్ అగర్వాల్, సత్య రంగయ్య ఫైనాన్స్ కంపెనీలోనూ ఐటీ రైడ్స్ కొనసాగుతున్నాయి.

Similar News

News February 19, 2025

సలామ్ DIIs: 45 రోజుల్లోనే రూ.లక్ష కోట్ల పెట్టుబడి

image

స్వదేశీ సంస్థాగత మదుపరులు (DII) భారత స్టాక్ మార్కెట్లకు ఆపద్బాంధవులుగా మారారు. FM నిర్మలా సీతారామన్ చెప్పినట్టుగానే రిటైల్ ఇన్వెస్టర్లతో కలిసి FIIల పెట్టుబడుల ఉపసంహరణను పూర్తిగా అబ్జార్బ్ చేసుకుంటున్నారు. 2025లో 45 రోజుల్లోనే రూ.1.2లక్షల కోట్లను ఈక్విటీల్లో కుమ్మరించారు. FIIలు వెనక్కి తీసుకున్న రూ.1.6 లక్షల కోట్లతో ఇది దాదాపుగా సమానం. 2024లోనూ DIIలు రూ.5.22 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడం విశేషం.

News February 19, 2025

ఆ సంఘటన తర్వాత మారిపోయా: హీరోయిన్

image

తన జీవితంలో ఏడాది క్రితం జరిగిన యాక్సిడెంట్ వల్ల చాలా విషయాలు నేర్చుకున్నట్లు హీరోయిన్ నభా నటేశ్ తెలిపారు. ప్రమాదం తర్వాత మామూలు స్థితికి వచ్చేందుకు చాలా శ్రమించినట్లు చెప్పారు. ఫిట్‌నెస్ కోసం తీవ్రంగా కష్టపడినట్లు తెలిపారు. దీని వల్ల వర్కౌట్స్ విషయంలో తన ధోరణి మారిందన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ నిఖిల్ సరసన ‘స్వయంభూ’ సినిమాలో నటిస్తున్నారు.

News February 19, 2025

‘బుక్’ పాలిటిక్స్

image

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఇప్పుడిదే ట్రెండ్ నడుస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు TDP జాతీయ ప్రధాని కార్యదర్శి లోకేశ్ ‘రెడ్’ బుక్ మెయింటేన్ చేస్తున్నామని ప్రకటించారు. తమను ఇబ్బంది పెట్టిన వారి భరతం పడతామని చెప్పారు. ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న BRS MLC కవిత కూడా ఇటీవల ‘పింక్’ బుక్‌ అంటూ వ్యాఖ్యానించారు. తాజాగా BJP MP ఈటల ‘కాషాయ’ బుక్ మెయింటేన్ చేస్తున్నట్లు చెప్పారు. దీనిపై మీ కామెంట్?

error: Content is protected !!