News April 29, 2024

50 ఏళ్లకే బీసీలకు వృద్ధాప్య పింఛను: చంద్రబాబు

image

AP: వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే వ్యాపారస్థులు కప్పం కట్టే దుస్థితి ఏర్పడుతుందని చంద్రబాబు విమర్శించారు. ‘జగన్ గత ఎన్నికల్లో కోడికత్తి, ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారు. వివేకాను ఎవరు చంపారు? రాయలసీమకు ఏమీ చేయని YCP నేతలకు ఎందుకు ఓట్లు వేయాలి? మా ప్రభుత్వం వచ్చాక 50 ఏళ్లకే BCలకు వృద్ధాప్య పింఛను ఇస్తాం. BC, SC, STలను ఆర్థికంగా పైకి తీసుకొస్తా. ముస్లింలకు అన్యాయం జరగనివ్వను’ అని చెప్పారు.

Similar News

News November 26, 2025

కర్నూలు జిల్లా నుంచి అధ్యక్షా.. అనేది వీరే..!

image

సంవిధాన్ దివస్-రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని (మాక్ అసెంబ్లీ) కల్పించారు. బుధవారం కర్నూలు జిల్లా నుంచి అసెంబ్లీలో మాట్లాడేందుకు జిల్లా ఎమ్మెల్యేలు (విద్యార్థులు) సిద్ధమయ్యారు. దయాన, లోకేశ్వర్ రెడ్డి, గాయత్రి, నవనీత్ కుమార్, వీరేంద్ర, గౌతమి, ప్రవీణ్ ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించనున్నారు.

News November 26, 2025

స్టూడెంట్స్ అసెంబ్లీ.. దద్దరిల్లుతున్న సభ

image

AP: రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో జరుగుతున్న ‘స్టూడెంట్స్ అసెంబ్లీ’ వాడివేడిగా జరుగుతోంది. విద్యార్థులు మంచి అంశాలపై చర్చ జరుపుతున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై ప్రశ్నలు ఎక్కుపెడుతున్నారు. మంత్రులు వీటికి దీటుగా బదులిస్తున్నారు. లోకేశ్, పవన్ కళ్యాణ్ పాత్రలు పోషిస్తున్న చిన్నారులు పంచ్ డైలాగులతో సమాధానాలు ఇస్తున్నారు. సభ పక్కదారి పట్టకుండా స్పీకర్(అమ్మాయి) అదుపు చేస్తున్నారు.

News November 26, 2025

జూన్-జులై మధ్య గోదావరి పుష్కరాలు?

image

AP: గోదావరి పుష్కరాలను 2027 జూన్ 26-జులై 7 మధ్య నిర్వహించనున్నట్లు సమాచారం. వేదపండితులతో దేవదాయ శాఖ చర్చించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఆమోదం తర్వాత అధికారిక ప్రకటన వెలువడనుందని అధికారవర్గాలు వెల్లడించాయి. గోదావరి పుష్కరాల నిర్వహణ, ఏర్పాట్లపై CM CBN త్వరలో మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహిస్తారని పేర్కొన్నాయి. చివరిసారి 2015లో గోదావరి పుష్కరాలు జరిగిన విషయం తెలిసిందే.