News August 2, 2024
Olympics: ఈరోజు భారత్ పాల్గొనే ఈవెంట్స్
ఇప్పటికే 2పతకాలు సాధించిన మను భాకర్ ఇవాళ జరిగే ఉమెన్స్ 25మీ. పిస్టల్ క్వాలిఫికేషన్ ఈవెంట్లో పాల్గొంటారు. ఆమెతో పాటు ఈషా సింగ్ బరిలో ఉన్నారు. బ్యాడ్మింటన్ క్వార్టర్స్లో లక్ష్యసేన్, మెన్స్ షూటింగ్లో అనంత్జీత్ పోటీ పడనున్నారు. ఆర్చరీ మిక్స్డ్-ధీరజ్, అంకిత, రోయింగ్ ఫైనల్-బల్రాజ్, షాట్పుట్-తజిందర్పాల్ బరిలో ఉన్నారు. మెన్స్ హాకీ టీమ్ ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. పూర్తి షెడ్యూల్ పైన ఫొటోల్లో..
Similar News
News February 3, 2025
అల్లు అర్జున్ ఫ్యాన్స్కు నిరాశ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ‘తండేల్’ ఈవెంట్కు ఆయన ముఖ్య అతిథిగా వస్తారని భావించినా కొన్ని కారణాలతో రాలేకపోయారు. దీంతో చాలా కాలం తర్వాత AA స్పీచ్ విందామనుకున్న అభిమానులకు మరోసారి ఎదురుచూపులు తప్పలేదు. అల్లు అర్జున్ వస్తారనే ఈ ఈవెంట్కి ఫ్యాన్స్కు ఎంట్రీ నిషేధించారని సినీ వర్గాలు పేర్కొన్న సంగతి తెలిసిందే.
News February 3, 2025
టీ20ల్లో భారత్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్లు
* అభిషేక్ శర్మ-135(ఇంగ్లండ్పై)
* శుభ్మన్ గిల్- 126*(న్యూజిలాండ్పై)
* రుతురాజ్ గైక్వాడ్- 123*(ఆస్ట్రేలియాపై)
* విరాట్ కోహ్లీ- 122*(అఫ్గానిస్థాన్పై)
* రోహిత్ శర్మ- 121*(అఫ్గానిస్థాన్పై)
News February 2, 2025
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
AP: తిరుపతి జిల్లా పుత్తూరు-నగరి మార్గంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రామాపురం వద్ద వేగంగా దూసుకు వచ్చిన లారీ ఓ ప్రైవేట్ బస్సును ఢీకొట్టిన ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. ఈ ఘటనలో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. లారీ తిరుత్తణి వైపు వెళ్లినట్లు స్థానికులు చెప్పారు. మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.