News July 25, 2024
OLYMPICS: క్వార్టర్స్ చేరిన మెన్స్ ఆర్చరీ టీమ్

పారిస్ ఒలింపిక్స్లో భారత పురుషుల ఆర్చరీ జట్టు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. బొమ్మదేవర ధీరజ్ (4వ స్థానం, 681 పాయింట్లు), తరుణ్ దీప్ రాయ్ (14, 674), ప్రవీణ్ జాదవ్ (39, 658) రాణించడంతో భారత్ మొత్తం 2013 పాయింట్లతో క్వార్టర్స్కు దూసుకెళ్లింది. కాగా మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ ఐదో స్థానానికే పరిమితమైంది. దీంతో రౌండ్ ఆఫ్ 16లో ఆడాల్సి ఉంటుంది.
<<-se>>#Olympics2024<<>>
Similar News
News December 4, 2025
తన కన్నా అందంగా ఉండొద్దని.. మేనత్త దారుణం!

కుటుంబంలో తన కన్నా అందంగా ఎవ్వరూ ఉండొద్దని దారుణాలకు పాల్పడిందో మహిళ. ముగ్గురు కోడళ్లు, కొడుకును నీళ్లలో ముంచి హత్య చేసింది. పానిపట్(హరియాణా)లో పెళ్లివేడుకలో విధి(6) టబ్లో పడి చనిపోయింది. పోలీసుల దర్యాప్తులో మేనత్త పూనమ్ హత్య చేసిందని తేలింది. మరో 3హత్యలూ చేసినట్లు పూనమ్ ఒప్పుకుంది. 2023లో ఇషిక(9)ను చంపిన ఆమె తనపై అనుమానం రాకుండా కొడుకు శుభం(3)ను చంపేసింది. ఆగస్టులో జియా(6)ను పొట్టనపెట్టుకుంది.
News December 4, 2025
ఫిబ్రవరిలో పెళ్లి అని ప్రచారం.. స్పందించిన రష్మిక

నటి రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్లో పెళ్లి జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘వివాహాన్ని నేను ధ్రువీకరించను. అలాగని ఖండించను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. అంతకుమించి ఏమీ చెప్పను’ అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.
News December 4, 2025
APPLY NOW: BEMLలో ఉద్యోగాలు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<


