News July 25, 2024
OLYMPICS: క్వార్టర్స్ చేరిన మెన్స్ ఆర్చరీ టీమ్

పారిస్ ఒలింపిక్స్లో భారత పురుషుల ఆర్చరీ జట్టు క్వార్టర్ ఫైనల్స్ చేరింది. బొమ్మదేవర ధీరజ్ (4వ స్థానం, 681 పాయింట్లు), తరుణ్ దీప్ రాయ్ (14, 674), ప్రవీణ్ జాదవ్ (39, 658) రాణించడంతో భారత్ మొత్తం 2013 పాయింట్లతో క్వార్టర్స్కు దూసుకెళ్లింది. కాగా మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్ ఐదో స్థానానికే పరిమితమైంది. దీంతో రౌండ్ ఆఫ్ 16లో ఆడాల్సి ఉంటుంది.
<<-se>>#Olympics2024<<>>
Similar News
News July 9, 2025
పెంపుడు కుక్క మీ జీవితకాలాన్ని పెంచుతుంది!

పెంపుడు కుక్కలున్న యజమానులు ఇతరులతో పోల్చితే రోజుకు 22ని.లు ఎక్కువగా నడుస్తారని లివర్పూర్ విశ్వవిద్యాలయ పరిశోధనలో వెల్లడైంది. ఇలా ఏటా మిలియన్ కంటే ఎక్కువ అడుగులు అదనంగా వేస్తారని తేలింది. యజమానులు కుక్క వేగానికి తగ్గట్లు నడిస్తే హైబీపీ& కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటిస్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుందని పేర్కొంది. తద్వారా వారి జీవితకాలం పెరుగుతుంది. మీకూ పెంపుడు కుక్క ఉందా? కామెంట్ చేయండి.
News July 9, 2025
మూడో టెస్టుకు టీమ్ ప్రకటన.. స్టార్ పేసర్ రీఎంట్రీ

భారత్తో రేపటి నుంచి జరగనున్న మూడో టెస్టుకు ఇంగ్లండ్ ఒక్క మార్పుతో జట్టును ప్రకటించింది. జోష్ టంగ్ ప్లేస్లో స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత కమ్బ్యాక్ ఇస్తున్నారు. దీంతో ENG బౌలింగ్ అటాక్ స్ట్రాంగ్గా కనిపిస్తోంది. లార్డ్స్లో గ్రీన్ పిచ్ ఉండనుందన్న వార్తల నేపథ్యంలో ఆర్చర్ కీలకంగా మారనున్నారు.
ENG: క్రాలే, డకెట్, పోప్, రూట్, బ్రూక్, స్టోక్స్, స్మిత్, వోక్స్, కార్స్, ఆర్చర్, బషీర్
News July 9, 2025
రేపట్నుంచే మామిడి రైతుల అకౌంట్లో డబ్బుల జమ

AP: మామిడి రైతులకు ఆర్థిక సాయం అందించేందుకు సీఎం చంద్రబాబు రూ.260 కోట్ల నిధుల విడుదలకు నిర్ణయించినట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూడకుండా ఇవాళ జరిగిన క్యాబినెట్ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రభుత్వం కిలోకు అదనంగా రూ.4 మద్దతు ధర ప్రకటించి మామిడి కొనుగోళ్లు చేపట్టిందన్నారు. ఆ డబ్బులను రేపటి నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు.