News August 3, 2024

Olympics: మనసులు గెలిచావ్ మనూ..

image

25మీ. పిస్టల్ షూటింగ్‌లో 4వ <<13767925>>స్థానంలో<<>> నిలవడం బాధగా ఉందని ఈవెంట్ తర్వాత మనూ భాకర్ తెలిపారు. పతకం గెలిచి ఉంటే బాగుండేదన్నారు. అయితే భారత్ ఇప్పటివరకు సాధించిన 3 పతకాల్లో 2(వ్యక్తిగత, మిక్స్‌డ్) ఆమె గెలుచుకున్నవే. మిగతా ఈవెంట్లలో భారత ప్లేయర్లంతా పతకాల కోసం చెమటోడుస్తుండగా, అంతర్జాతీయ వేదికపై ఆమె భారత జెండాను రెపరెపలాడించారు. కోట్లాది మంది భారతీయుల మనసులు గెలుచుకున్నారు.

Similar News

News December 10, 2025

నాగార్జున సాగర్@70ఏళ్లు

image

కృష్ణా నదిపై నిర్మించిన ఆనకట్టల్లో నాగార్జున సాగర్ అతి పెద్ద బహుళార్థ సాధక ప్రాజెక్టు. దీనికి శంకుస్థాపన చేసి నేటికి 70 ఏళ్లు. 1955 DEC 10న ఆనాటి PM నెహ్రూ పునాది రాయి వేశారు. 1967లో ఇందిరా గాంధీ కుడి, ఎడమ కాలువల ద్వారా నీటిని విడుదల చేశారు. 1911లోనే నిజాం ఈ ప్రాంతంలో ఆనకట్ట కట్టాలని అనుకున్నా కార్యరూపం దాల్చలేదు. సాగర్ నుంచి ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు సాగునీరు అందుతోంది.

News December 10, 2025

మీరు గెలిస్తే ప్రజల తీర్పు.. మేం గెలిస్తే ఓట్ చోరీనా?: కలిశెట్టి

image

AP: రాష్ట్రంలో జరిగిన ఎన్నికలపై YCP MP మిథున్‌రెడ్డి లోక్‌సభలో మాట్లాడిన తీరు హాస్యాస్పదమని TDP MP కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. ‘ఓట్ చోరీ‌పై ఆయన మాట్లాడడం విడ్డూరంగా ఉంది. విజయనగరం, చిత్తూరు, హిందూపూర్‌లో ఓట్ల చోరీ జరిగినట్టు ఆయన చెప్పారు. YCP గెలిచినప్పుడు ప్రజాస్వామ్య తీర్పు అన్నారు. మేం గెలిస్తే ఓట్ చోరీ అంటున్నారు. YCP హయాంలో పలు ఎన్నికలు ఎలా జరిగాయో ప్రజలంతా చూశారు’ అని మండిపడ్డారు.

News December 10, 2025

గ్లోబల్ సమ్మిట్: ఆ విద్యార్థులకే అనుమతి

image

TG: గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల సందర్శనకు ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని రెసిడెన్షియల్ స్కూళ్ల విద్యార్థులనే ఇవాళ అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఆ పాఠశాలలను రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఎంపిక చేస్తారని చెప్పింది. 2PM నుంచి 7PM వరకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది. గురువారం నుంచి మిగిలిన రోజుల్లో ఎవరెవరికి ప్రవేశం ఉంటుందనే విషయాన్ని నేడు ప్రకటిస్తామని వెల్లడించింది.