News March 27, 2024

ఏప్రిల్ 13న BRS భారీ బహిరంగ సభ

image

TG: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఏప్రిల్ 13న చేవెళ్లలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించి విజయవంతం చేయాలని ఆయన పార్టీ నేతలను ఆదేశించారు. కాగా చేవెళ్ల బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్‌లో చేరడంతో ఆ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌ బరిలో నిలిచారు.

Similar News

News March 26, 2026

రాజధాని పేరుతో అమరావతిలో అవినీతి యజ్ఞం: సజ్జల

image

AP: అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఏంటని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అలాగైతే మండలిలోనూ చర్చ పెట్టాలన్నారు. అమరావతిలో CM చంద్రబాబు అవినీతి యజ్ఞం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిపై జగన్‌కు అభ్యంతరం లేదని, అందుకే CBN కంటే ముందే భూమి కొనుక్కొని ఆఫీస్, ఇల్లు కట్టుకున్నట్లు చెప్పారు. రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతిని ఆయన వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

News March 26, 2026

అంతరాయం లేకుండా ఇంధన సరఫరా: కేంద్రం

image

దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్రం పునరుద్ఘాటించింది. అన్ని రిటైల్ ఔట్‌లెట్లకు సరిపడా సప్లై చేస్తున్నట్లు పేర్కొంది. దేశంలోని ప్రతి సిటిజెన్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా ఇంధన సరఫరాకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని, అధికారిక ప్రకటనలు మాత్రమే ఫాలో కావాలని విజ్ఞప్తి చేసింది. దేశంలో 2 నెలలకు సరిపడా ఆయిల్ ఉందని వెల్లడించింది.

News March 26, 2026

రేపే శ్రీరామనవమి.. ముహూర్తం ఇదే

image

శ్రీరామనవమి వేడుకలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. రేపు చైత్ర శుద్ధ నవమి రోజున ఉ.11.06 నుంచి మ.1.31 వరకు రఘురాముడి పూజకు మంచి సమయమని పండితులు చెబుతున్నారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా ఇదే సమయంలో జరుగుతుందంటున్నారు. మ.ఒంటి గంటలోపు ఇంట్లో స్వామివారికి నివేదన సమర్పించి, ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి భోజనం చేయాలని సూచిస్తున్నారు. ఇక రేపు భద్రాద్రిలో 12pmకు సీతారాముల కళ్యాణం జరగనుంది.