News April 29, 2024
మే 1న 48.92 లక్షల మంది ఖాతాల్లో పింఛను జమ

AP: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 65.50 లక్షల మంది పింఛనుదారుల్లో 48.92లక్షల మంది(74%) బ్యాంకు ఖాతాలు ఆధార్తో అనుసంధానమైనట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్ తెలిపారు. వీరికి మే1న నేరుగా ఖాతాల్లో నగదు జమచేయనున్నట్లు వెల్లడించారు. మిగతా 16.58 లక్షల మందికి ఇంటింటికీ వెళ్లి అందిస్తామని చెప్పారు. మే 1 నుంచి 5వ తేదీ వరకు పింఛను పంపిణీ ఉంటుందని పేర్కొన్నారు.
Similar News
News April 19, 2026
CSK చెత్త రికార్డ్

IPL: SRHతో నిన్న ఓడిన చెన్నై జట్టు చెత్త రికార్డును మూటగట్టుకుంది. 2019 నుంచి 180+ స్కోరును ఒక్కసారి కూడా ఛేదించలేకపోయింది. అప్పటి నుంచి CSK జట్టుకు 14 సార్లు 180+ లక్ష్యాన్ని ఛేదించాల్సిన అవసరం రాగా అన్నింటిలోనూ ఓడింది. మరోవైపు HYDలోని ఉప్పల్ స్టేడియంలో CSK 8 ఏళ్లుగా ఒక్క గెలుపునూ నమోదు చేయలేకపోయింది. ఇక ఈ సీజన్లో ఆడిన 6 మ్యాచుల్లో రెండింటిలోనే గెలిచి పాయింట్స్ టేబుల్లో 7వ స్థానంలో ఉంది.
News April 19, 2026
AP రైతులకు గుడ్ న్యూస్.. సేకరణ పరిమితి పెంపు!

APలోని పప్పు ధాన్యాల రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ పరిమితిని పెంచుతూ ప్రధాని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఉన్న 94,500 టన్నుల పరిమితిని ఇప్పుడు ఏకంగా 1.13 లక్షల టన్నులకు పెంచారు. మార్కెట్లో ధరలు లేక ఇబ్బంది పడుతున్న రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా ఈ చర్యలు చేపట్టినట్లు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడించారు.
News April 19, 2026
పవన్ కళ్యాణ్కు జరిగిన సర్జరీ ఇదేనా?

AP Dy.CM పవన్ కళ్యాణ్ ముక్కుకు హైదరాబాద్లోని అపోలో ఆస్పత్రిలో శస్త్రచికిత్స జరిగినట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ఉన్న సైనసైటిస్ కారణంగా నిన్న ఊపిరి తీసుకోవడంలో ఎక్కువగా ఇబ్బంది కలగడంతో ఆయన వైద్యులను సంప్రదించారు. సర్జరీ అవసరమని డాక్టర్లు నిర్ధారించి ముక్కుకు ఆపరేషన్ చేసి శ్వాస ఇబ్బందిని తొలగించినట్లు పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. సర్జరీ అనంతరం పవన్ ఇంటికి వెళ్లిపోయారని చెబుతున్నాయి.


