News November 6, 2024

ON THIS DAY: అండమాన్‌ను స్వాధీనం చేసుకున్న నేతాజీ

image

జపాన్ ఇంపీరియల్ ఫోర్స్ ఆక్రమణలో ఉన్న అండమాన్ నికోబార్ దీవిని 1943లో ఇదేరోజున భారత సైన్యం సుప్రీం కమాండర్‌ సుభాష్ చంద్రబోస్ స్వాధీనం చేసుకున్నారు. టోక్యోలో జపాన్ ప్రధానిని కలిసిన తర్వాత నవంబర్ 6, 1943న A&N దీవులను భారత్‌కు అప్పగిస్తున్నట్లు ప్రకటన వచ్చింది. అనంతరం 30 డిసెంబర్ 1943న భారత గడ్డపై తొలిసారిగా జాతీయ త్రివర్ణ పతాకాన్ని నేతాజీ ఎగురవేశారు.

Similar News

News December 15, 2025

PPP విధానమే బెస్ట్: చంద్రబాబు

image

AP: ప్రజలను మభ్య పెట్టేందుకు మెడికల్ కాలేజీల అంశాన్ని కొందరు <<18575709>>రాజకీయం<<>> చేస్తున్నారని సీఎం <<18575135>>చంద్రబాబు<<>> విమర్శించారు. మెరుగైన చదువు, సేవలు కావాలంటే పీపీపీనే సరైన విధానమని పార్లమెంటరీ కమిటీ స్పష్టం చేసిందన్నారు. పీపీపీ విధానంలోనే రహదారులు, ఎయిర్ పోర్టులు వంటి సదుపాయాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. మరోవైపు 18 నెలల్లోనే రూ.21 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని వివరించారు.

News December 15, 2025

14 గంటలు, 28 ఆర్డర్లకు రూ.762.. వైరల్

image

బ్లింకిట్ డెలివరీ ఏజెంట్ తన రోజువారీ సంపాదనపై చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఒక రోజులో 28 ఆర్డర్లు డెలివరీ చేసి ఇన్సెంటివ్స్‌తో కలిపి రూ.762 సంపాదించానని తెలిపాడు. ఇందుకోసం 14 గం. కష్టపడ్డానని చెప్పాడు. అయితే ఇది చాలా తక్కువ సంపాదన అని, బ్లింకిట్ శ్రమ దోపిడీకి పాల్పడుతోందని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. క్విక్ కామర్స్ వల్ల ఎంతో మందికి ఉపాధి లభిస్తోందని మరికొందరు అంటున్నారు. COMMENT?

News December 15, 2025

విజయ్ హజారే ట్రోఫీ అందరూ ఆడాల్సిందే: BCCI

image

డిసెంబరు 24 నుంచి ప్రారంభంకానున్న విజయ్ హజారే ట్రోఫీలో జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ తప్పనిసరిగా పాల్గొనాలని BCCI స్పష్టం చేసింది. కనీసం రెండు మ్యాచ్‌లు ఆడాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం కోహ్లీ, రోహిత్‌లకి మాత్రమే కాకుండా అందరికీ వర్తిస్తుందని తెలిపింది. దేశవాళీ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. గాయాలతో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్‌కు మినహాయింపు ఉంది.