News November 14, 2024

ఒకప్పుడు పండ్లు అమ్మారు.. ఇప్పుడు రూ.10వేల కోట్ల ఆస్తి!

image

సినీ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతులెవరో తెలుసా? హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ప్రకారం రూ.10వేల కోట్ల నికర విలువతో T-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అగ్రస్థానంలో ఉన్నారు. గతంలో కపూర్‌లు, చోప్రాలకే ఈ ట్యాగ్ ఉండేది. అయితే, ఇప్పుడు అత్యంత ధనవంతులైనప్పటికీ.. భూషన్ కుటుంబం ఒకప్పుడు పండ్లు అమ్ముకునేది. 1970లలో భూషన్ తండ్రి గుల్షన్ కుమార్ సంగీత క్యాసెట్లు విక్రయించే షాపును కొనుగోలు చేయడంతో వీరి రాత మారిపోయింది.

Similar News

News December 6, 2025

MBBS ప్రవేశాల్లో బాలికలదే పైచేయి: మంత్రి

image

AP: ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి GOVT, PVT వైద్య కళాశాలల్లో MBBS ప్రవేశాలు ముగిశాయి. ఇందులో 60.72% అడ్మిషన్లు అమ్మాయిలే పొందినట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. గత రెండేళ్లతో పోల్చితే వీరి ప్రవేశాలు 3.66% పెరిగాయన్నారు. 2023-24లో 57.06%, 2024-25లో 57.96%, 2025-26లో 60.72% మంది అమ్మాయిలు సీట్లు పొందారని చెప్పారు. స్కూల్ దశ నుంచే ప్రణాళికతో చదువుతూ ర్యాంకులు సాధిస్తున్నారని తెలిపారు.

News December 6, 2025

లైఫ్ సపోర్ట్‌పై ‘ఇండీ కూటమి’: ఒమర్

image

బిహార్ CM నితీశ్ NDAలోకి వెళ్లడానికి ఇండీ కూటమే కారణమని J&K CM ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. రెండేళ్ల కిందట కూటమి కన్వీనర్‌గా తన అభ్యర్థిత్వాన్ని కొందరు అడ్డుకున్నారని చెప్పారు. HT లీడర్‌షిప్ సమ్మిట్‌లో మాట్లాడుతూ ‘బిహార్ మహాగట్‌బంధన్‌లో JMM చేరలేదు. రేపు జాతీయస్థాయిలోనూ అది కూటమిని వీడితే తప్పెవరిది? ప్రస్తుతం మా కూటమి లైఫ్ సపోర్ట్‌పై ఉంది. కొందరైతే దాని కథ ముగిసిందంటున్నారు’ అని పేర్కొన్నారు.

News December 6, 2025

కంపెనీలు ఈ బిల్లుకు మద్దతివ్వాలి: ఉద్యోగులు

image

లైఫ్‌లో ఉద్యోగం ఓ పార్ట్. కానీ ప్రస్తుతం ఉద్యోగమే జీవితమైపోతోంది. టెకీలైతే రోజులో 12-14 గంటలు పనిచేస్తున్నారు. దీంతో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. పని ఒత్తిడితో కుటుంబాన్ని కూడా పట్టించుకోవట్లేదు. అందుకే ‘<<18487853>>రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు<<>>’ను తీసుకురావాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఉద్యోగి మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే పనిలో ఉత్పాదకత మెరుగుపడుతుంది. ఈ బిల్లుకు కంపెనీలూ మద్దతు ఇవ్వాలంటున్నారు.