News November 14, 2024

ఒకప్పుడు పండ్లు అమ్మారు.. ఇప్పుడు రూ.10వేల కోట్ల ఆస్తి!

image

సినీ ఇండస్ట్రీలో అత్యంత ధనవంతులెవరో తెలుసా? హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2024 ప్రకారం రూ.10వేల కోట్ల నికర విలువతో T-సిరీస్ అధినేత భూషణ్ కుమార్ అగ్రస్థానంలో ఉన్నారు. గతంలో కపూర్‌లు, చోప్రాలకే ఈ ట్యాగ్ ఉండేది. అయితే, ఇప్పుడు అత్యంత ధనవంతులైనప్పటికీ.. భూషన్ కుటుంబం ఒకప్పుడు పండ్లు అమ్ముకునేది. 1970లలో భూషన్ తండ్రి గుల్షన్ కుమార్ సంగీత క్యాసెట్లు విక్రయించే షాపును కొనుగోలు చేయడంతో వీరి రాత మారిపోయింది.

Similar News

News July 11, 2025

జురెల్ బ్యాటింగ్ చేయవచ్చా?

image

రిషభ్ పంత్ గాయంపై ఇంకా అప్డేట్ రాలేదు. ఒకవేళ ఆయన తిరిగి ఆటలోకి రాకుంటే టీమ్ ఇండియా 10 మంది బ్యాటర్లతోనే ఆడాల్సి ఉంటుంది. ఐసీసీ రూల్స్ ప్రకారం సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ బౌలింగ్, బ్యాటింగ్ చేయలేడు. అంపైర్ అనుమతితో కీపింగ్ మాత్రమే చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. కేవలం కంకషన్ (తలకు గాయం) అయితేనే సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ బ్యాటింగ్/బౌలింగ్ చేయగలడు. కానీ పంత్ వేలికి గాయంతో జురెల్ వచ్చారు.

News July 11, 2025

రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ: ఉత్తమ్

image

TG: సీఎం రేవంత్ చేతుల మీదుగా ఈ నెల 14న కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని మంత్రి ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. దాదాపు 5 లక్షల కొత్త కార్డులు ఇస్తున్నామని చెప్పారు. కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం జరుగుతుందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎప్పుడైనా తెల్ల రేషన్ కార్డులిస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే రూ.13వేల కోట్లతో 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామన్నారు.

News July 11, 2025

ఒక్క MLA అయినా రైతులను పరామర్శించాడా?: పేర్ని నాని

image

AP: చంద్రబాబు ప్రభుత్వం రైతులను దగా చేస్తోందని వైసీపీ నేత పేర్ని నాని మండిపడ్డారు. మామిడి కొనుగోళ్లపై మంత్రులు అధికారులు తలో మాట చెబుతున్నారని ఆరోపించారు. ‘మామిడి, పొగాకు, మిర్చి రైతులకు గిట్టుబాటు ధర లేదు. ఒక్క ఎమ్మెల్యే అయినా వారిని పరామర్శించారా? రైతులను పరామర్శించడానికి జగన్ వెళ్తుంటే అడ్డుకుంటారా? కొంతమందికి కూలీ ఇచ్చి మరీ జగన్‌ను తిట్టిస్తున్నారు’ అని ఆయన ఫైర్ అయ్యారు.