News May 26, 2024

దూసుకొస్తున్న తుఫాన్.. 394 విమానాలు రద్దు

image

బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ <<13316903>>తుఫాన్<<>> బెంగాల్ తీరం వైపుగా దూసుకొస్తోంది. ముందు జాగ్రత్తగా ఇవాళ సాయంత్రం నుంచి రేపు మధ్యాహ్నం వరకు 394 విమానాలను రద్దు చేస్తున్నట్లు నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్‌పోర్టు యాజమాన్యం ప్రకటించింది. ఈ నిర్ణయం 63 వేల మంది ప్రయాణికులపై ప్రభావం చూపనుంది. తుఫాను తీరం దాటే సమయంలో 80-90Kmph వేగంతో ఈదురుగాలులు, 200mm వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD వెల్లడించింది.

Similar News

News February 14, 2025

స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర ర్యాంకులు ప్రకటించిన ప్రభుత్వం

image

AP: స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్రలో భాగంగా 14 సూచికల ఆధారంగా జిల్లాలకు ప్రభుత్వం ర్యాంకులు కేటాయించింది. వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్స్, డోర్ టు డోర్ వేస్ట్ కలక్షన్స్, సాలిడ్ వేస్ట్ సెగ్రిగేషన్, క్లీన్ విలేజ్, సహా పలు అంశాలకు పాయింట్లు కేటాయించి ర్యాంకులు ప్రకటించారు. 200 పాయింట్లకు 129 పాయింట్లతో ఎన్టీఆర్ జిల్లా మొదటి స్థానంలో, 81 పాయింట్లతో అల్లూరి జిల్లా 26వ స్థానంలో నిలిచాయి.

News February 14, 2025

ఏ జిల్లాకు ఏ ర్యాంక్ వచ్చింది?

image

AP: ఎన్టీఆర్-1, విశాఖ-2, ఈస్ట్ గోదావరి-3, అనంతపురం-4, అన్నమయ్య-5, శ్రీకాకుళం-6, కడప-7, గుంటూరు-8, బాపట్ల-9, నెల్లూరు-10లో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వెస్ట్ గోదావరి, అనకాపల్లి, తిరుపతి, కాకినాడ, ఏలూరు, కృష్ణా, కోనసీమ, మన్యం, శ్రీ సత్యసాయి, పల్నాడు, కర్నూలు, ప్రకాశం, నంద్యాల, విజయనగరం, చిత్తూరు, అల్లూరి జిల్లాలు ఉన్నాయి.

News February 14, 2025

TGSRTCకి రూ.21.72 కోట్ల టోకరా.. ‘గో రూరల్’ ఆస్తులు సీజ్

image

TGSRTC బస్సులపై ప్రకటనల పేరుతో గో రూరల్ ఇండియా రూ.21.72 కోట్ల మోసానికి పాల్పడింది. యాడ్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆర్టీసీకి ఇవ్వకుండా తమ అనుబంధ కంపెనీలకు మళ్లించుకుని వ్యాపారం చేసినట్లు ఈడీ గుర్తించింది. దీంతో ఆ సంస్థకు చెందిన రూ.6.47 కోట్ల విలువైన స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేసింది. ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది.

error: Content is protected !!