News December 3, 2024
కొనసాగుతున్న క్యాబినెట్ సమావేశం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశం కొనసాగుతోంది. ఐటీ, ఏపీ టెక్స్టైల్, మారిటైమ్, టూరిజం, స్పోర్ట్స్ పాలసీలతో పాటు ఆయుర్వేద, హోమియోపతి మెడికల్ ప్రాక్టీషనర్స్ రిజిస్ట్రేషన్ చట్టసవరణ బిల్లు, CRDA నిర్ణయాలు, రేషన్ బియ్యం అక్రమ రవాణా సహా పలు అంశాలపై చర్చించనున్నారు.
Similar News
News December 28, 2025
వైద్యం అందక భారత సంతతి వ్యక్తి మృతి.. మస్క్ ఆగ్రహం

కెనడాలో సరైన చికిత్స అందక భారత సంతతి వ్యక్తి ప్రశాంత్ శ్రీకుమార్(44) మృతి చెందడంపై ఎలాన్ మస్క్ తీవ్రంగా స్పందించారు. తీవ్రమైన ఛాతీ నొప్పితో హాస్పిటల్కు వెళ్లిన ప్రశాంత్ను 8 గంటలపాటు వెయిట్ చేయించారు. దీంతో కెనడా హెల్త్కేర్ సిస్టంను US మోటార్ వెహికిల్ డిపార్ట్మెంట్తో పోల్చుతూ విమర్శలు గుప్పించారు. మరోవైపు కెనడా ప్రభుత్వం ఈ ఘటనకు బాధ్యత వహించాలని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది.
News December 28, 2025
U-19 కెప్టెన్గా వైభవ్ సూర్యవంశీ

చిన్న వయసులోనే తన టాలెంట్తో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న వైభవ్ సూర్యవంశీ మరో ఘనత సాధించారు. కేవలం 14ఏళ్ల వయసులోనే దక్షిణాఫ్రికా U-19తో జరిగే 3 వన్డేల సిరీస్కు కెప్టెన్గా ఎంపికయ్యారు. U-19 వరల్డ్ కప్కు ముందు జరిగే ఈ సిరీస్కు రెగ్యులర్ కెప్టెన్ ఆయుష్ మాత్రే, వైస్ కెప్టెన్ విహాన్ మల్హోత్రా గాయాల కారణంగా దూరమయ్యారు. దీంతో BCCI వైభవ్కు బాధ్యతలు అప్పగించింది. జనవరి 3 నుంచి సిరీస్ ప్రారంభం కానుంది.
News December 28, 2025
జగన్ అంతా తెలుసు అనుకుంటారు: లోకేశ్

AP: PPP విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని YCP వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి లోకేశ్ ఓ వార్తను రీట్వీట్ చేస్తూ Ex.CM జగన్కు చురకలంటించారు. ‘కేంద్రం, సీనియర్ ఎడిటర్స్, డొమైన్ ఎక్స్పర్ట్స్ అంతా వైద్య విద్యలో సామర్థ్యాన్ని పెంచేందుకు PPP విధానం సరైందని నమ్ముతున్నారు. కానీ, మన విధ్వంసక ప్రతిపక్ష నాయకుడు మాత్రం అందరికంటే తనకే ఎక్కువ తెలుసు అనుకుంటారు’ అని ట్వీట్ చేశారు.


