News January 29, 2025
ఆర్జీవీకి ఒంగోలు పోలీసుల నోటీసులు

ప్రముఖ దర్శకుడు రామ్గోపాల్ వర్మకు మరోసారి ప్రకాశం జిల్లా పోలీసులు నోటీసులు పంపారు. ఫిబ్రవరి 4న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్లపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టడంపై ఆర్జీవీకి ఈ నోటీసులు పంపారు. కాగా గతంలోనూ ఆర్జీవీకి పోలీసులు సమన్లు అందించారు. కానీ విచారణకు హాజరు కాలేనంటూ తన న్యాయవాదులతో సమాచారం పంపారు.
Similar News
News February 14, 2025
నీ సంకల్పం గొప్పది బ్రో..!

సివిల్ సర్వెంట్ కావాలనేది ఎంతో మంది కల. దీనికి ఎంతో కష్టమైన UPSC పరీక్షల్లో ఉత్తీర్ణులవ్వాల్సిందే. కొందరు నాలుగైదు అటెంప్ట్స్లో, మరికొందరు ఒక్కసారికే సివిల్ సర్వెంట్ అయిపోతుంటారు. కానీ మధ్యప్రదేశ్కు చెందిన శ్రీవాస్తవ(48) ఇప్పటివరకు UPSC, MPPSC కలిపి 73 సార్లు ప్రిలిమ్స్, 43సార్లు మెయిన్స్, 8 సార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లినా ఉద్యోగం పొందలేకపోయారు. ప్రతిసారి నిరాశే ఎదురైనా ప్రిపరేషన్ కొనసాగించారు.
News February 14, 2025
కొత్త సీఈసీగా జ్ఞానేశ్ కుమార్?

చీఫ్ ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ FEB 18న రిటైర్ కానున్నారు. దీంతో కొత్త CEC ఎంపిక కోసం PM మోదీ, లా మినిస్టర్ అర్జున్ మేఘ్వాల్, LOP రాహుల్ గాంధీలతో కూడిన కమిటీ ఈ నెల 17న భేటీ కానుంది. 480 మంది నుంచి సెర్చ్ కమిటీ ఐదుగురిని షార్ట్ లిస్టు చేయనుంది. ఈ జాబితాలో 1988 బ్యాచ్ IAS ఆఫీసర్ జ్ఞానేశ్ కుమార్ ముందువరుసలో ఉన్నారు. ఈయన గతంలో కీలక పదవుల్లో పనిచేశారు. 2024 జనవరి 31న రిటైర్ అయ్యారు.
News February 14, 2025
తెలంగాణ ఉద్యమంపై పుస్తకాలు రావాలి: CM

తెలంగాణ ఉద్యమ చరిత్రపై మరిన్ని సమగ్రమైన పుస్తకాలు రావాలని CM రేవంత్ ఆకాంక్షించారు. మాజీ MP దేవేందర్ గౌడ్ రాసిన విజయ తెలంగాణ పుస్తకాన్ని CM ఆవిష్కరించారు. ‘TG ఉద్యమంపై లోతైన చర్చ జరగాలి. ఎన్నో వర్గాలు పాల్గొన్నా, ఒక కుటుంబమే పాల్గొన్నట్లు వక్రీకరించారు. ఉద్యమం టైంలో ప్రజలంతా తమ వాహనాలు, ఆఫీసులు, గుండెలపై TG అని రాసుకున్నారు. ఇప్పుడు ప్రజలు కోరుకున్నట్లుగానే TSను TGగా మార్చాం’ అని CM వెల్లడించారు.