News September 23, 2024

కేజీ ఉల్లి రూ.35.. సప్లైకి సిద్ధంగా 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్

image

ఉల్లి ధరలకు కళ్లెమేసేందుకు బఫర్ స్టాక్‌ను కేంద్రం హోల్‌సేల్ మార్కెట్లకు సప్లై చేయనుంది. ఇప్పటికే కొన్ని సిటీల్లో NCCF, NAFED ద్వారా కిలో రూ.35కే అమ్ముతున్నట్టు ప్రకటించింది. ‘ఎగుమతి సుంకం ఎత్తేయడంతో ఉల్లి ధరలు పెరుగుతాయని ముందే అంచనా వేశాం. అందుకే మావద్ద ఉన్న 4.7 లక్షల టన్నుల బఫర్ స్టాక్‌ను సబ్సిడీతో విక్రయిస్తాం’ అని కన్జూమర్ అఫైర్స్ సెక్రటరీ నిధి అన్నారు. ప్రస్తుతం కేజీ ఉల్లి రూ.60గా ఉంది.

Similar News

News September 23, 2024

ఆస్కార్‌-2025: ‘హనుమాన్’ జస్ట్ మిస్!

image

భారత్ నుంచి ఆస్కార్-2025కి ఫారిన్ ఫిల్మ్ కేటగిరీలో ‘లాపతా లేడీస్’ను నామినేట్ చేసినట్లు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తంగా ఈ జాబితాలో 29 సినిమాలను FFI పరిశీలించింది. వీటిలో తెలుగు సినిమాలు హనుమాన్, కల్కి, మంగళవారం ఉన్నాయి. అత్యధికంగా హిందీ నుంచి 12, తమిళం నుంచి 6, మలయాళం నుంచి 4, మరాఠీ నుంచి 3, ఒడియా నుంచి ఒకటి ఉన్నాయి. అంతిమంగా ‘లాపతా లేడీస్’కే ఫెడరేషన్ ఓటేసింది.

News September 23, 2024

లౌకికవాదం భారత్‌కు అవసరం లేదు: తమిళనాడు గవర్నర్

image

లౌకికవాదం పేరుతో భారత ప్రజలకు ‘మోసం’ జరిగిందని త‌మిళ‌నాడు గ‌వ‌ర్న‌ర్ RN ర‌వి చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశం అయ్యాయి. లౌకిక‌వాదం భారతదేశంలో అవసరం లేదన్నారు. ‘ఈ దేశ ప్రజలపై ఎన్నో మోసాలు జరిగాయి. లౌకికవాదాన్ని తప్పుగా అభివర్ణించడం వాటిలో ఒకటి. లౌకికవాదం అనేది యూరోపియన్ భావన. భారతీయ భావన కాదు. ఐరోపాలో చర్చికి, రాజుకు మధ్య ఘర్షణ వల్ల సెక్యులరిజం పుట్టింది’ అని ఆయన పేర్కొన్నారు.

News September 23, 2024

నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలపై దుమారం

image

ఒత్తిడిని ఎదుర్కోవ‌డానికి అంత‌ర్గ‌త బ‌లం ఉండాలని, అది దైవత్వం నుంచి వస్తుంది కాబట్టి తల్లిదండ్రులు ఆ దిశగా పిల్లల్ని పెంచాలంటూ కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపాయి. కేరళకు చెందిన యువ CA మృతిపై ఆమె ఈ విధంగా స్పందించారు. నిర్మల వ్యాఖ్యలను కేరళ CPM, కాంగ్రెస్ తీవ్రంగా ఖండించాయి. నిర్మల IT ఉద్యోగులను దోపిడీ చేసే కార్పొరేట్ డ్రాక్యులాలకు రక్షకురాలిగా మారారని విమర్శించాయి.