News February 2, 2025
5 మ్యాచుల్లో 35 పరుగులే
ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో భారత ప్లేయర్ సంజూ శాంసన్ పేలవ ప్రదర్శన చేశారు. ఆడిన 5 మ్యాచుల్లో 7 సగటుతో 35 పరుగులే చేశారు. ఇవాళ్టి మ్యాచులో సిక్సర్తో ఇన్నింగ్స్ ప్రారంభించి ఊపు మీదున్నట్లు కనిపించినా రెండో ఓవర్లోనే పుల్ షాట్ ఆడి క్యాచ్ ఔట్గా వెనుదిరిగారు. దీంతో శాంసన్కు ఇంకా ఎన్ని అవకాశాలు ఇవ్వాలని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. గైక్వాడ్ వంటి ప్లేయర్లకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు.
Similar News
News February 3, 2025
నేటి ముఖ్యాంశాలు
* అండర్-19 ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ విజేతగా భారత్
* TG: ఫిబ్రవరి 15లోపే పంచాయతీ ఎన్నికల షెడ్యూల్: మంత్రి పొంగులేటి
* తెలంగాణ అంటే బీజేపీకి ద్వేషం: సీతక్క
* ఈ నెల 4న కులగణనపై క్యాబినెట్ భేటీ
* AP: పెద్దిరెడ్డికే కాదు.. ఎవరికీ భయపడం: నాగబాబు
* పోలవరం ఎత్తు తగ్గింపుతో తీవ్ర నష్టం: బొత్స
* ఇంగ్లండ్పై 4-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకున్న భారత్
News February 3, 2025
విఫలమవుతున్నా సంజూకి ఛాన్సులివ్వాలి: మంజ్రేకర్
సంజూ శాంసన్ వరసగా విఫలమైనా అతడిపై నమ్మకం ఉంచి ఎక్కువ అవకాశాలిస్తూ ఉండాలని కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ‘టీ20ల్లో పరుగులెన్ని చేశారని కాకుండా ఆటగాడు ఎలాంటి ప్రభావం చూపిస్తాడో అంచనా వేయాలి. సంజూ వంటి బ్యాటర్ క్రీజులో ఉంటే మ్యాచ్ గతినే మార్చేయగలరు. ఒంటిచేత్తో మ్యాచులు గెలిపించగలరు. ఒక్కోసారి వైఫల్యాలు వస్తాయి. అయినప్పటికీ ఓపిగ్గా ఛాన్సులిచ్చి అండగా నిలవాలి’ అని పేర్కొన్నారు.
News February 3, 2025
అల్లు అర్జున్ ఫ్యాన్స్కు నిరాశ
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది. ‘తండేల్’ ఈవెంట్కు ఆయన ముఖ్య అతిథిగా వస్తారని భావించినా కొన్ని కారణాలతో రాలేకపోయారు. దీంతో చాలా కాలం తర్వాత AA స్పీచ్ విందామనుకున్న అభిమానులకు మరోసారి ఎదురుచూపులు తప్పలేదు. అల్లు అర్జున్ వస్తారనే ఈ ఈవెంట్కి ఫ్యాన్స్కు ఎంట్రీ నిషేధించారని సినీ వర్గాలు పేర్కొన్న సంగతి తెలిసిందే.