News June 30, 2024

ధరణి దరఖాస్తులు పెండింగ్‌లో పెడితే వేటే: రెవెన్యూశాఖ

image

TG: ధరణిలో భూ సమస్యల పరిష్కారానికి సంబంధించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 2.34 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా, 2 వారాల్లో 24,778 మాత్రమే పరిష్కరించారని పలు జిల్లాల కలెక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్డీవోల పనితీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు. దరఖాస్తులు పెండింగ్‌లో పెడితే వేటు తప్పదని హెచ్చరించారు.

Similar News

News September 20, 2024

రాజ‌కీయ కార్యాచ‌ర‌ణ‌పై ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌క‌ట‌న‌

image

త‌మిళ‌గ వెట్రి క‌ళగం మొద‌టి రాష్ట్ర స్థాయి స‌ద‌స్సును అక్టోబ‌ర్ 27న విల్లుపురం జిల్లాలోని విక్రవాండి వి సలై గ్రామంలో నిర్వహించనున్న‌ట్టు ద‌ళ‌ప‌తి విజ‌య్ ప్ర‌క‌టించారు. త‌మిళ‌ ప్రజల అభిమానం, మద్దతుతో తమ విజయవంతమైన రాజకీయ యాత్ర సాగుతోందన్నారు. పార్టీ రాజకీయ భావజాల నేత‌ల‌ను, పార్టీ సిద్ధాంతాలను, విధానాలను, భవిష్యత్తు కార్యాచరణను స‌ద‌స్సులో ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు విజ‌య్ తెలిపారు.

News September 20, 2024

వర్క్ లైఫ్ బ్యాలెన్స్.. యూరప్‌లో బెస్ట్

image

సౌత్ఏషియాతో పోలిస్తే యూరప్ దేశాల్లో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెరుగ్గా ఉంది. ఇక్కడ వారానికి సగటున 35Hrs మాత్రమే పనిచేస్తున్నారని ILO తెలిపింది. నెదర్లాండ్స్‌లో 31.6, నార్వేలో 33.7, జర్మనీలో 34.2, జపాన్‌లో 36.6, సింగపూర్ 42.6 గంటలు పనిచేస్తున్నారు. ఇక వనాటులో ఉద్యోగులు సగటున 24.7 గంటలే పనిచేస్తుండటం గమనార్హం. కిరిబాటి 27.3, మైక్రోనేషియా 30.4 గంటలతో తక్కువ పనివేళల జాబితాలో ముందున్నాయి.

News September 20, 2024

నెయ్యి నాణ్యత 100 పాయింట్లకు 20 పాయింట్లే ఉంది: టీటీడీ ఈఓ

image

AP: నెయ్యి నాణ్యత ఉంటేనే, లడ్డూ నాణ్యతగా ఉంటుందని టీటీడీ ఈఓ శ్యామలరావు అన్నారు. గతంలో వాడిన నెయ్యి నాణ్యత 100 పాయింట్లకుగానూ 20 పాయింట్లే ఉందని ఆయన తెలిపారు. ‘గతంలో ఏఆర్ డెయిరీ వచ్చిన 4 ట్యాంకర్లలోని నెయ్యిని తిరిగి పంపాం. ఆ నెయ్యిని 10 ల్యాబ్‌లలో పరీక్షించాం. వారంలో రిపోర్టు వచ్చింది. ఆ నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు రిపోర్టులో తేలింది’ అని ఆయన పేర్కొన్నారు.