News March 28, 2024
బీజేపీ తరఫున పోటీ చేసేది టీడీపీ నేతలే: సజ్జల

AP: చంద్రబాబు ఇచ్చే హామీలకు విలువ లేదని, ఆయన ఏది చెప్పినా అమలు చేయరని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆయన అధికారంలోకి వస్తే పెన్షన్లు ఆగిపోతాయన్నారు. బీజేపీ తరఫున కూడా టీడీపీ నేతలే పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ బస్సు యాత్రలో ఉపయోగించే ప్యాంట్రీ వెహికల్కు ఈసీ అనుమతి తీసుకున్నామని చెప్పారు. దీనిపై తప్పుడు ప్రచారం చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
Similar News
News October 17, 2025
జపాన్ మాజీ ప్రధాని కన్నుమూత

జపాన్ మాజీ ప్రధాని టొమిచి మురయమా(101) అనారోగ్యంతో కన్నుమూశారు. ఫాదర్ ఆఫ్ జపాన్ పాలిటిక్స్గా పిలవబడే మురయమా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ వెల్లడించింది. ఆయన 1994 నుంచి 1996 వరకు ప్రధానిగా పనిచేశారు. వరల్డ్ వార్-2 సమయంలో ఆసియాలో జపాన్ చేసిన దారుణాలకు పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది.
News October 17, 2025
సీతాఫలం.. మహిళల ఆరోగ్యానికి వరం

సీతాఫలంలో విటమిన్లు A, C, B6, ఖనిజాలు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని మహిళలు తింటే గుండె ఆరోగ్యం, జీర్ణక్రియ, రోగనిరోధక శక్తి, చర్మ నిగారింపు, హిమోగ్లోబిన్ మెరుగుపడుతుంది. షుగర్, బీపీ, ఒత్తిడి కంట్రోల్ అవుతుంది. ఇందులోని కాపర్ గర్భిణుల్లో పిండం అభివృద్ధిలో సహాయపడుతుంది. వాంతులు, మూడ్ స్వింగ్స్ అదుపులో ఉంటాయి. ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి.
#ShareIt
News October 17, 2025
ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పించండి: భట్టి

TG: BC రిజర్వేషన్లను BJPనే అడ్డుకుంటోందని Dy.CM భట్టి విక్రమార్క మండిపడ్డారు. ‘దీనిపై అఖిల పక్షంతో PMను కలవాలనుకున్నాం. కానీ ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఇప్పటికీ మేం సిద్ధంగా ఉన్నాం. రామ్చందర్రావు, BJP నేతలు ఇప్పిస్తే కలుస్తాం. రేపటి బంద్ BJPకి వ్యతిరేకంగానే జరుగుతుంది. రిజర్వేషన్లపై SC తీర్పుపై న్యాయనిపుణులతో చర్చించి తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం’ అని భట్టి అన్నారు.