News March 28, 2024
బీజేపీ తరఫున పోటీ చేసేది టీడీపీ నేతలే: సజ్జల

AP: చంద్రబాబు ఇచ్చే హామీలకు విలువ లేదని, ఆయన ఏది చెప్పినా అమలు చేయరని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆయన అధికారంలోకి వస్తే పెన్షన్లు ఆగిపోతాయన్నారు. బీజేపీ తరఫున కూడా టీడీపీ నేతలే పోటీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ బస్సు యాత్రలో ఉపయోగించే ప్యాంట్రీ వెహికల్కు ఈసీ అనుమతి తీసుకున్నామని చెప్పారు. దీనిపై తప్పుడు ప్రచారం చేయడం దిగజారుడుతనానికి నిదర్శనమని మండిపడ్డారు.
Similar News
News February 9, 2026
లిప్స్టిక్ ఎక్కువగా వాడుతున్నారా?

లిప్ స్టిక్ లో ఉండే లెడ్, అల్యూమినియం, క్రోమియం, కాడ్మియం, మెగ్నీషియం శరీరంలోకి చేరితే చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు. లిప్స్టిక్ నిరంతరం ఉపయోగించడం వల్ల అలర్జీలు, ఇన్ఫెక్షన్లు వస్తాయి. కాబట్టి లిప్స్టిక్ను పరిమితంగా వాడాలని సూచిస్తున్నారు. కెమికల్స్, పారాబెన్ లేని లిప్స్టిక్ను మాత్రమే ఎంచుకోండి. లిప్ స్టిక్ వేసుకునే ముందు బేస్ కోసం కన్సీలర్ ఉపయోగించండి. ప్రెగ్నెన్సీలో వాడకపోవడమే మంచిది.
News February 9, 2026
అంబటి రాంబాబుపై 52 కేసులు!

AP: వైసీపీ నేత <<19026518>>అంబటి రాంబాబు<<>>పై రాష్ట్రవ్యాప్తంగా 52 కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఇందులో 3 పీటీ వారెంట్లను అధికారులు సిద్ధం చేశారని సమాచారం. అటు అంబటిపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని, 8 రోజుల్లో 36 కేసులు పెట్టిందని వైసీపీ ఆరోపించింది. మరిన్ని పీటీ వారెంట్లు జారీ చేసి ఆయన్ను రాష్ట్రమంతా తిప్పాలని ప్లాన్ చేస్తోందని విమర్శించింది. CM CBNపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి అరెస్టయ్యారు.
News February 9, 2026
సైలెంట్ కిల్లర్: భారత్లో నలుగురిలో ఒకరికి ‘ఫ్యాటీ లివర్’!

ఇండియా ప్రస్తుతం ఒక సైలెంట్ హెల్త్ క్రైసిస్ని ఎదుర్కొంటోంది. డ్రింకింగ్ అలవాటు లేకపోయినా కేవలం ఒబెసిటీ, డయాబెటిస్ వల్ల వచ్చే ఫ్యాటీ లివర్ (MASLD) కేసులు దేశంలో విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా ‘ది లాన్సెట్’లో పబ్లిష్ అయిన అధ్యయనం ప్రకారం మన దేశంలో ప్రతి నలుగురు అడల్ట్స్లో ఒకరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. వీరిలో చాలా మందికి కాలేయం గట్టిపడటం (Fibrosis) వంటి ప్రమాదకర లక్షణాలు ఇప్పటికే మొదలయ్యాయి.


