News November 12, 2024
ఇద్దరు పిల్లలు ఉంటేనే పోటీకి అర్హత: CM

AP: భవిష్యత్తులో యువత తగ్గుతుందని అందుకే జనాభాను పెంచాల్సిన అవసరం ఉందని CM చంద్రబాబు అన్నారు. నిన్న ఉపాధ్యాయుల అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ఆయన.. పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి అందరూ మాట్లాడాలని సూచించారు. ఇద్దరు పిల్లలు లేకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హత అనే నిబంధన పెడుతున్నామని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకోకపోతే దక్షిణాది రాష్ట్రాల్లో పిల్లలు తగ్గిపోతారని వ్యాఖ్యానించారు.
Similar News
News March 5, 2026
US దాడి చేస్తే ఇండియాపై నిందలేంటి: అమిత్ మాలవీయ

ఇరాన్ నౌకపై అమెరికా దాడి చేస్తే ఇండియాను నిందించడంలో లాజిక్ లేదని BJP నేత అమిత్ మాలవీయ విమర్శించారు. ‘భారత తీరానికి 250 నాటికల్ మైళ్ల దూరంలో, సముద్ర పరిధికి అవతల అటాక్ జరిగింది. సమీపంలో ఉన్నంత మాత్రాన ప్రతి ఘటనకు ఆ దేశం బాధ్యత వహించదు. అంతర్జాతీయ జలాల్లో కార్యకలాపాలను IND నియంత్రించదు. US-ఇరాన్ మధ్య జరిగిన దానికి ఇండియాను జవాబుదారీగా చేయాలనుకోవడం సమర్థనీయం కాదు’ అని ట్వీట్ చేశారు.
News March 5, 2026
❤️నచ్చేశావ్ సంజూ..

T20WC: సంజూ శాంసన్ టీమ్ కోసం సెంచరీని కూడా లెక్క చేయలేదు. అతడు ఔటయ్యే సమయానికి భారత్ స్కోర్ 13 ఓవర్లలో 160గా ఉంది. అప్పటికే సంజూ 41 బంతుల్లో 89 రన్స్ చేశారు. సెంచరీ ముందు కూడా జట్టుకు భారీ స్కోర్ అందించాలని సిక్సర్ కోసం ట్రై చేశారు. అయితే మిస్ టైమ్ కావడంతో క్యాచ్ ఔటయ్యారు. సంజూ ఆరంభం నుంచి దూకుడుగా ఆడటంతో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లపై ఒత్తిడి పడలేదు. దీంతో భారత్ ఈజీగా 253 రన్స్ చేసింది.
News March 5, 2026
విరోష్ జంటకు సీఎం శుభాకాంక్షలు

TG: సీఎం రేవంత్ రెడ్డి నూతన దంపతులు రష్మిక-విజయ్ దేవరకొండను ఆశీర్వదించారు. రిసెప్షన్ సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం.. ఇవాళ విజయ్ నివాసానికి వెళ్లారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఫ్యామిలీతో కలిసి ఫొటో దిగారు.


