News April 23, 2025
ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదల

AP: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఓపెన్ SSC పరీక్షలకు 26,679 మంది హాజరవగా 10,119 మంది పాసయ్యారు. ఇంటర్లో 63,668 విద్యార్థులకు గాను 33,819 మంది ఉత్తీర్ణత సాధించారు. రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ కోసం ఈనెల 26 నుంచి మే 5 వరకు ఫీజు చెల్లించవచ్చు. రీకౌంటింగ్కు ఒక్కో సబ్జెక్టుకు ₹200, రీవెరిఫికేషన్కు ₹1000 చెల్లించాలి. https://apopenschool.ap.gov.in/ సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు
Similar News
News March 12, 2026
దేశం సంక్షోభంలో.. మోదీ టూర్లో: ఖర్గే

దేశం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ తరుణంలో PM మోదీ ఎన్నికల టూర్ చేపడుతున్నారని విమర్శించారు. ‘దేశవ్యాప్తంగా LPG కొరత ఉంది. ప్రజలు క్యూలైన్లలో నిలబడుతున్నారు. అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయి. ప్రభుత్వం దగ్గర మాత్రం సమాధానం లేదు. దౌత్యపరంగా విఫలమవడం చాలా తీవ్రమైన అంశం. ఎనర్జీ మిస్మేనేజ్మెంట్ ఫలితాన్ని 140 కోట్ల మంది అనుభవిస్తున్నారు’ అని ఖర్గే పోస్ట్ చేశారు.
News March 12, 2026
ఇంటర్ పూర్తయిందా?.. ఓ లుక్కేయండి!

<<19343753>>ఇంటర్<<>> పూర్తయినవారు రెగ్యులర్ కోర్సులకే పరిమితం కాకుండా క్రియేటివిటీతో కూడిన డేటా అనలిటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. క్రియేటివిటీ ఉన్నవారు డిజైన్ (NID/NIFT) కోర్సుల ద్వారా రాణించవచ్చు. పర్యాటక రంగం విస్తరిస్తుండటంతో హోటల్ మేనేజ్మెంట్లో కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజినీర్ అవ్వాలనుకుంటే AI, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీకి మంచి డిమాండ్ ఉంది.
News March 12, 2026
కొత్త ఏడాది ఏ రాశి వారికి ఎలా ఉందంటే?

ఈనెల 19న చైత్ర శుద్ధ పాడ్యమి రోజున తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా ‘శ్రీ పరాభవ నామ’ సంవత్సరంలో అన్ని రాశుల ఆదాయ వ్యయాలు, రాజపూజ్య, అవమానాల పంచాగాన్ని ‘భక్తి’ టీవీ విడుదల చేసింది. ముఖ్యంగా మిథున రాశివారికి ఆదాయం కంటే వ్యయం & రాజ్య పూజ్యం కంటే అవమానాలే ఎక్కువగా ఉంటాయని పండితులు తెలిపారు. సింహ రాశి వారికి అన్నీ సరిసమానంగా ఉంటాయని చెప్పారు. మీ రాశి ఏంటో కామెంట్ చేసి షేర్ చేయండి.


