News March 20, 2024
ఆపరేషన్ పిఠాపురం

AP: పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడించేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ‘ఆపరేషన్ పిఠాపురం’లో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారంపూడితో పాటు కాపు నేతలైన ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబులతో ప్రచారం చేయించనున్నట్లు తెలుస్తోంది. కీలక నేతలకు వార్డుల వారీగా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. త్వరలోనే పిఠాపురంలో సీఎం జగన్ బస్సుయాత్ర కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News February 11, 2025
అదానీపై అమెరికా కేసులో మరో ట్విస్ట్

అదానీ గ్రూప్పై లంచం కేసులో జో బైడెన్ పాలకవర్గంలోని DoJ తీసుకున్న నిర్ణయాలు ప్రశ్నార్థకంగా ఉన్నాయని ఆరుగురు US కాంగ్రెస్ సభ్యులు కొత్త అటార్నీ జనరల్కు లేఖరాశారు. ఇవి మిత్రదేశం భారత్తో సంబంధాలను సందిగ్ధంలో పడేశాయన్నారు. రాజకీయాలు, వాణిజ్యం, ఎకానమీస్కు అతీతంగా ఎదిగిన 2 దేశాల అనుబంధాన్ని బైడెన్ నిర్ణయాలు రిస్క్లో పడేశాయని వెల్లడించారు. కేసును పక్కనపెట్టాల్సింది పోయి ముందుకెళ్లారని ఆరోపించారు.
News February 11, 2025
సైఫ్కు ప్లాస్టిక్ కత్తి ఇచ్చిన కొడుకు.. ఎందుకంటే?

స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్పై దుండగుడు దాడి చేసిన విషయం తెలిసిందే. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాక తన చిన్న కొడుకు జెహ్ చెప్పిన మాటలను ఆయన గుర్తుచేసుకున్నారు. ‘‘పిల్లలు బాగానే ఉన్నారు. దేవుడికి ధన్యవాదాలు. ‘మళ్లీ దొంగ ఇంట్లోకి వస్తాడేమో. ఇది మీ దగ్గర ఉంచుకోండి’ అని జెహ్ ఓ ప్లాస్టిక్ కత్తి ఇచ్చాడు. ‘అబ్బాను గీత కాపాడింది. అబ్బా నన్ను కాపాడాడు’ అని తను చెప్పాడు’’ అని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
News February 11, 2025
ఐదేళ్ల విధ్వంసంతో వెనకబడ్డాం: CM చంద్రబాబు

AP: గత ఐదేళ్ల విధ్వంసంతో చాలా వెనకబడిపోయామని సీఎం చంద్రబాబు అన్నారు. సమర్థ నాయకత్వం ఉంటే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని చెప్పారు. నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తూ ఉన్నామన్నారు. ‘సంపద సృష్టించాలి.. పేదలకు పంచాలి. ఆరు నెలల పాలనలో 12.94% వృద్ధిరేటు కనబడింది. ఫైళ్ల పరిశీలన వేగం పెంచాలి. సమస్య వచ్చిన వెంటనే పరిష్కరిస్తే మంచి ఫలితాలు వస్తాయి’ అని సచివాలయంలో మంత్రులు, కార్యదర్శుల సమావేశంలో CM అన్నారు.