News February 24, 2025
ఆపరేషన్ SLBC: రెండు ప్లాన్లు సిద్ధం చేసిన అధికారులు

TG: శనివారం ఉదయం SLBC సొరంగంలో చిక్కుకున్న కార్మికులు ఇంకా బయటికి రాలేదు. వారిని తీసుకొచ్చేందుకు NDRF, నేవీ ప్రయత్నిస్తున్నాయి. అయితే బురద వల్ల లోనికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్లాన్-ఎ, ప్లాన్-బి రూపొందించాయి. సొరంగానికి సమాంతరంగా మరొకటి తవ్వడం, పైనుంచి రంధ్రం చేసి లోపలికి వెళ్లడం. ఈ రెండింటిపై కసరత్తు చేస్తున్నాయి. మరోవైపు ఆ 8మంది సురక్షితంగా బయటికి రావాలని అంతా కోరుకుంటున్నారు.
Similar News
News March 21, 2025
ఉల్లిపాయ తింటే కలిగే ప్రయోజనాలివే..!

ఉల్లిపాయ తినటం వల్ల శరీరం చల్లగా ఉంటుంది. తద్వార వడదెబ్బ తాకే ప్రమాదాన్ని నివారించవచ్చు. ఇందులో ఉండే అధిక నీటిశాతం, ఖనిజాల వల్ల డీహైడ్రేషన్ సమస్య రాకుండా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అధిక శాతం ఫైబర్ ఉంటుంది తద్వార జీర్ణశక్తి పెరుగుతుంది. సల్ఫర్, పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో సహకరిస్తాయి. ఇవి తినటం వల్ల చర్మం, జుట్టుకు సైతం ఎంతో మేలు.
News March 21, 2025
SLBC టన్నెల్ ప్రమాదంపై అధికారుల సమీక్ష

SLBC టన్నెల్ లో జరుగుతున్న సహాయక చర్యలపై అధికారులు సమీక్ష నిర్వహించారు. పనులను వేగవంతం చేసేందుకు అన్ని విభాగాలను సమన్వయం చేస్తున్నట్లు తెలిపారు. భద్రతా ప్రమాణాలను పాటిస్తూనే సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 22న టన్నెల్ ప్రమాదం జరగగా 8మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకున్నారు. వీరిలో ఒక ఇంజినీర్ మృతదేహం లభించింది.
News March 21, 2025
కర్ణాటకలో మంత్రులు సహా 48మంది నేతలపై ‘హనీ ట్రాప్’!

కర్ణాటకలో మంత్రులు సహా 48మంది ‘హనీ ట్రాప్’లో చిక్కుకున్నారంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలకోసం విసిరిన వలపు వలల్లో జాతీయ స్థాయి నేతలు సైతం చిక్కుకున్నారని అసెంబ్లీలో మంత్రి కేఎన్ రాజన్న వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేయించాలని అటు అధికార, ఇటు విపక్ష నేతలు డిమాండ్ చేయడంతో దర్యాప్తు చేయిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.